భారతీయ సైన్యంలో చేరాలనుకునే నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం. విశాఖపట్నం నగరంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వేదికగా సెప్టెంబర్ 3 నుండి 20వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది. ఈ ఎంపిక ప్రక్రియలో భాగంగా ఇదివరకు నిర్వహించిన రాత పరీక్షలో అర్హత సాధించిన దాదాపు 10,355 మంది అభ్యర్థులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.
ర్యాలీ నిర్వహణ, ఏర్పాట్లపై విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిషోర్ కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశ సేవకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల వసతులు కల్పించాలని ఆయన ఆదేశించారు.
ర్యాలీ సఫీగా సాగేందుకు రవాణా సదుపాయం, నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీరు, సమాచార సాంకేతిక వసతులు, మైక్ సిస్టమ్స్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. అలాగే భద్రత, పారదర్శకత కోసం ప్రాంగణమంతటా CCTV కెమెరాలను అమర్చాలని సూచించారు.
ర్యాలీలో అత్యంత కీలకమైన 1.6 కిలోమీటర్ల రన్నింగ్ పోటీలను ఆర్కే బీచ్ రోడ్డులో రాత్రి వేళల్లో నిర్వహించనున్నారు. ప్రసిద్ధ కాళీమాత ఆలయం సమీపం నుండి ప్రారంభమయ్యే ఈ పరుగు పందెం విక్టరీ ఎట్ సీ వార్ మెమోరియల్ వరకు సాగుతుంది.
ప్రతిరోజు సుమారు 800 మంది అభ్యర్థులు ఈ పరుగు పందెంలో పాల్గొంటారు. రాత్రి పరుగు సజావుగా సాగేందుకు బీచ్ రోడ్డు మార్గంలో బారికేడ్ల ఏర్పాటు, తగినంత వెలుగునిచ్చే విద్యుత్ దీపాలు, తాగునీటి సదుపాయం కల్పించాలని సూచించారు. పోటీల సమయంలో సాధారణ ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
స్టేడియంలో శారీరక దృఢత్వ పరీక్షలకు ఏర్పాట్లు చేయడంతో పాటు వైద్య బృందాలు, అంబులెన్స్లు, మొబైల్ టాయిలెట్లు, వసతి, జనరేటర్లు, వాటర్ప్రూఫ్ టెంట్లు, ఇతర సదుపాయాలను కల్పించాలని కూడా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
{{/usCountry}}స్టేడియంలో శారీరక దృఢత్వ పరీక్షలకు ఏర్పాట్లు చేయడంతో పాటు వైద్య బృందాలు, అంబులెన్స్లు, మొబైల్ టాయిలెట్లు, వసతి, జనరేటర్లు, వాటర్ప్రూఫ్ టెంట్లు, ఇతర సదుపాయాలను కల్పించాలని కూడా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
{{/usCountry}}అభ్యర్థుల కోసం రవాణా, విద్యుత్ సరఫరా, సీసీటీవీ కెమెరాలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ మరియు ఐటీ (IT) సదుపాయాలను కల్పించాలని ఆయన సూచించారు.
'ఆర్కే బీచ్ రోడ్డులోని కాళీ మాత ఆలయం వద్ద నుండి విక్టరీ ఎట్ సీ యుద్ధ స్మారకం వరకు 1.6 కిలోమీటర్ల రాత్రిపూట పరుగు ఉంటుంది. ప్రతిరోజూ సుమారు 800 మంది అభ్యర్థులు ఇందులో పాల్గొంటారు. ఈ మార్గంలో ట్రాఫిక్ నియంత్రణ, పోలీసు భద్రత, బారికేడింగ్, లైటింగ్, తాగునీటి ఏర్పాట్లు చేయాలి.'అని అధికారులను కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిషోర్ ఆదేశించారు.