Army Recruitment : వైజాగ్లో సెప్టెంబర్ 3 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
Army Recruitment : ఆర్మీలో చేరాలనుకునేవారికి మంచి అవకాశం. వైజాగ్లో సెప్టెబర్ 3వ తేదీ నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది.
భారతీయ సైన్యంలో చేరాలనుకునే నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం. విశాఖపట్నం నగరంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వేదికగా సెప్టెంబర్ 3 నుండి 20వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది. ఈ ఎంపిక ప్రక్రియలో భాగంగా ఇదివరకు నిర్వహించిన రాత పరీక్షలో అర్హత సాధించిన దాదాపు 10,355 మంది అభ్యర్థులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.
ర్యాలీ నిర్వహణ, ఏర్పాట్లపై విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిషోర్ కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశ సేవకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల వసతులు కల్పించాలని ఆయన ఆదేశించారు.
ర్యాలీ సఫీగా సాగేందుకు రవాణా సదుపాయం, నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీరు, సమాచార సాంకేతిక వసతులు, మైక్ సిస్టమ్స్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. అలాగే భద్రత, పారదర్శకత కోసం ప్రాంగణమంతటా CCTV కెమెరాలను అమర్చాలని సూచించారు.
ర్యాలీలో అత్యంత కీలకమైన 1.6 కిలోమీటర్ల రన్నింగ్ పోటీలను ఆర్కే బీచ్ రోడ్డులో రాత్రి వేళల్లో నిర్వహించనున్నారు. ప్రసిద్ధ కాళీమాత ఆలయం సమీపం నుండి ప్రారంభమయ్యే ఈ పరుగు పందెం విక్టరీ ఎట్ సీ వార్ మెమోరియల్ వరకు సాగుతుంది.
ప్రతిరోజు సుమారు 800 మంది అభ్యర్థులు ఈ పరుగు పందెంలో పాల్గొంటారు. రాత్రి పరుగు సజావుగా సాగేందుకు బీచ్ రోడ్డు మార్గంలో బారికేడ్ల ఏర్పాటు, తగినంత వెలుగునిచ్చే విద్యుత్ దీపాలు, తాగునీటి సదుపాయం కల్పించాలని సూచించారు. పోటీల సమయంలో సాధారణ ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
స్టేడియంలో శారీరక దృఢత్వ పరీక్షలకు ఏర్పాట్లు చేయడంతో పాటు వైద్య బృందాలు, అంబులెన్స్లు, మొబైల్ టాయిలెట్లు, వసతి, జనరేటర్లు, వాటర్ప్రూఫ్ టెంట్లు, ఇతర సదుపాయాలను కల్పించాలని కూడా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
అభ్యర్థుల కోసం రవాణా, విద్యుత్ సరఫరా, సీసీటీవీ కెమెరాలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ మరియు ఐటీ (IT) సదుపాయాలను కల్పించాలని ఆయన సూచించారు.
'ఆర్కే బీచ్ రోడ్డులోని కాళీ మాత ఆలయం వద్ద నుండి విక్టరీ ఎట్ సీ యుద్ధ స్మారకం వరకు 1.6 కిలోమీటర్ల రాత్రిపూట పరుగు ఉంటుంది. ప్రతిరోజూ సుమారు 800 మంది అభ్యర్థులు ఇందులో పాల్గొంటారు. ఈ మార్గంలో ట్రాఫిక్ నియంత్రణ, పోలీసు భద్రత, బారికేడింగ్, లైటింగ్, తాగునీటి ఏర్పాట్లు చేయాలి.'అని అధికారులను కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిషోర్ ఆదేశించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


