ఆంధ్రప్రదేశ్లోని స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. సచివాలయ వ్యవస్థలో ఆరేళ్ల సర్వీస్ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఉద్యోగులకు ‘ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్’ (AAS) వర్తింపజేయాలని ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకుంది.
ఏపీ ప్రభుత్వం
{{^htLoading}} {{/htLoading}}
ప్రభుత్వ నిర్ణయం మేరకు 6 సంవత్సరాల సర్వీసును పూర్తి చేసుకున్న సచివాలయ సిబ్బందికి స్పెషల్ గ్రేడ్ పోస్ట్ స్కేల్ మంజూరు చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. 11వ వేతన సవరణ సంఘం (11th PRC) నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ విధివిధానాలను అమలు చేయనున్నారు. ఈ మేరకు స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ విభాగ కార్యదర్శి భాస్కర్ ఐఏఎస్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో పదోన్నతి అవకాశాలు త్వరగా రాని ఉద్యోగులకు ఆర్ధికంగా ఊరట కలిగించేందుకు ఈ ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ను అమల్లోకి తెచ్చారు. ఒకే కేడర్లో నిర్దిష్ట కాలం (6, 12, 18, 24 ఏళ్లు) సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగులకు తదుపరి స్కేల్ను మంజూరు చేస్తారు. 6 ఏళ్లు పూర్తయిన సచివాలయ సిబ్బందికి స్పెషల్ గ్రేడ్ పోస్ట్ స్కేల్ రావడం వల్ల వారి ప్రాథమిక వేతనం పెరిగి, ప్రతినెల చేతికి వచ్చే వేతనం పెరుగుతుంది.
సచివాలయ ఉద్యోగులుగా చేరి ఆరేళ్లు పూర్తయినా ప్రమోషన్లు లభించని వారికి ఈ స్కీమ్ ద్వారా ఆర్థిక భరోసాతో పాటు ఉద్యోగంలో మెరుగైన ప్రోత్సాహం లభిస్తుంది. పెరిగిన స్కేల్తో పాటు డీఏ, హెచ్ఆర్ఏ అలవెన్సుల రూపంలో కూడా ఉద్యోగులకు అదనపు లబ్ధి చేకూరుతుంది.
{{^htLoading}} {{/htLoading}}
{{^usCountry}}
సచివాలయ ఉద్యోగుల దీర్ఘకాలిక అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని, 11వ పీఆర్సీ నిబంధనల ప్రకారం 6 ఏళ్ల సర్వీసును పరిగణించి ఎఏఎస్ అమలు చేయడంపై సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల వేలాది మంది గ్రామీణ, పట్టణ సచివాలయ ఉద్యోగులకు ఆర్థికంగా లబ్ధి చేకూరనుంది.
{{/usCountry}}
{{#usCountry}}
సచివాలయ ఉద్యోగుల దీర్ఘకాలిక అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని, 11వ పీఆర్సీ నిబంధనల ప్రకారం 6 ఏళ్ల సర్వీసును పరిగణించి ఎఏఎస్ అమలు చేయడంపై సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల వేలాది మంది గ్రామీణ, పట్టణ సచివాలయ ఉద్యోగులకు ఆర్థికంగా లబ్ధి చేకూరనుంది.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.