...
...
Next Story

AP Beach Shacks : ఏపీ బీచ్‌లలో దొరకనున్న బీర్లు.. బీచ్ షాక్స్ మార్గదర్శకాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌లోని 12 తీర ప్రాంత జిల్లాల్లో గోవా తరహా బీచ్ షాక్స్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం అనుమతినిచ్చింది. వైజాగ్, సూర్యలంక బీచ్‌లలో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభం కానున్న ఈ పాలసీ నిబంధనలు చూడండి.

Updated on: Jun 17, 2026 07:45 PM IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ సుదీర్ఘ తీరప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. గోవా, పాండిచ్చేరి తరహాలో పర్యాటకులను ఆకర్షించేందుకు వీలుగా ఏపీ తీరాలలో ‘బీచ్ షాక్స్’ ఏర్పాటుకు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ అధికారికంగా జీవో నంబర్ - 362ను జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ బీచ్ షాక్స్ మార్గదర్శకాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ బీచ్ షాక్స్ మార్గదర్శకాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్(APTDC) పర్యవేక్షణలో రాష్ట్రంలోని 12 తీర ప్రాంత జిల్లాల్లో ఎంపిక చేసిన బీచ్‌లలో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన కీలక సిఫార్సుల ఆధారంగా ఈ సరికొత్త పర్యాటక విధానానికి తెరలేపారు.

సూర్యలంక, వైజాగ్‌లలో తొలి ప్రయోగం

ఈ ప్రాజెక్టును తొలుత పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా బాపట్లలోని ప్రసిద్ధ సూర్యలంక బీచ్, విశాఖపట్నంలోని ప్రముఖ బీచ్‌లలో మొదటి విడతగా ఈ బీచ్ షాక్స్ అందుబాటులోకి రానున్నాయి. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 2029 ఆగస్టు 31వ తేదీ వరకు (ఐదేళ్ల కాలపరిమితి) ఈ షాక్స్ నిర్వహణకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఏడాది పాటు వీటి పనితీరు, పర్యాటకుల స్పందన, శాంతిభద్రతలను సమీక్షించిన తర్వాతే రాష్ట్రంలోని మిగతా బీచ్‌లకు ఈ విధానాన్ని విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది.

కఠిన నిబంధనలు

పర్యాటక వినోదంతో పాటు స్థానిక సంస్కృతి, భద్రతకు భంగం కలగకుండా ఎక్సైజ్ శాఖ కఠినమైన రూల్స్ విధించింది. ఈ బీచ్ షాక్స్ కేవలం ఉదయం 10:00 గంటల నుంచి రాత్రి 08:00 గంటల వరకు మాత్రమే పనిచేయాలి. రాత్రి వేళల్లో వీటికి అనుమతి ఉండదు.

బీచ్ షాక్స్‌లను పర్యావరణానికి హాని కలిగించని తాత్కాలిక నిర్మాణాలతోనే నిర్మించాల్సి ఉంటుంది. ప్లాస్టిక్ నియంత్రణ, వ్యర్థాల నిర్వహణ బాధ్యత పూర్తిగా నిర్వాహకులదే. ప్రస్తుతం మాల్దీవులు, గోవా వంటి ప్రాంతాలకు వెళ్తున్న దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆంధ్రా తీరానికి రప్పించడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. ఆధునిక ఆహారపు అలవాట్లు, వినోద సౌకర్యాలతో కూడిన ఈ షాక్స్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరగడమే కాకుండా, తీర ప్రాంత స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని పర్యాటక శాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe