ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట నిచ్చింది. పీఎం ఆవాస్ యోజన పథకం కింద రెండు రాష్ట్రాలకు కలిపి ఏకంగా 5 లక్షల ఇళ్లను కేటాయించినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్కు 3 లక్షల ఇళ్లు, తెలంగాణకు 2 లక్షల ఇళ్లు దక్కాయి. గ్రామీణాభివృద్ధి శాఖ చరిత్రలోనే ఇరు రాష్ట్రాలకు ఇంత పెద్దమొత్తంలో ఇళ్లు మంజూరు కావడం ఇదే తొలిసారని ఆయన తెలిపారు.

కేంద్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత గతంలో ప్రకటించిన కోటా కంటే అదనంగా ఇళ్లను మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. గతంలో ఇచ్చిన కేటాయింపులకు అదనంగా మరో 2.25 లక్షల ఇళ్లను ఏపీకి ఇచ్చారు. అడిగిన దానికి మించి అదనంగా 1.25 లక్షల ఇళ్లను తెలంగాణకు కేటాయించారు.
2019-2024 మధ్య కాలంలో ఇళ్ల నిర్మాణ పురోగతిపై మాట్లాడిన మంత్రి.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీకి 1.78 లక్షల ఇళ్లు కేటాయిస్తే అందులో కేవలం 42 వేల ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయని చెప్పారు. ఇక తెలంగాణ విషయానికొస్తే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేయలేదని గుర్తుచేశారు. అయితే రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా 2, 3 సార్లు ఢిల్లీ వచ్చి విజ్ఞప్తి చేయడంతో, తెలంగాణ ప్రభుత్వం కోరిన దానికంటే ఎక్కువ ఇళ్లను కేంద్రం మంజూరు చేసిందని వివరించారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లబ్ధిదారులకు లభించే ఆర్థిక సాయం వివరాలను మంత్రి పెమ్మసాని వివరించారు. ప్రాథమిక సాయం ప్రతి ఇంటి నిర్మాణానికి కేంద్రం నేరుగా రూ.1.20 లక్షల ఆర్థిక సాయం అందిస్తుంది. అదనపు సాయం కలిపితే లబ్ధిదారునికి దాదాపు రూ.1.80 లక్షల వరకు ప్రయోజనం చేకూరుతుంది.
ఇళ్లలోనే మరుగుదొడ్డి నిర్మాణానికి స్వచ్ఛ భారత్ మిషన్ కింద అదనంగా రూ.12,000 అందజేస్తారు. నిజమైన పేదలకు ఇళ్లు దక్కాలనే ఉద్దేశంతో కేంద్రం లబ్ధిదారుల ఎంపిక అర్హతల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ నెలవారీ ఆదాయ పరిమితిని రూ.10,000 నుంచి రూ.15,000కు పెంచారు.
{{/usCountry}}ఇళ్లలోనే మరుగుదొడ్డి నిర్మాణానికి స్వచ్ఛ భారత్ మిషన్ కింద అదనంగా రూ.12,000 అందజేస్తారు. నిజమైన పేదలకు ఇళ్లు దక్కాలనే ఉద్దేశంతో కేంద్రం లబ్ధిదారుల ఎంపిక అర్హతల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ నెలవారీ ఆదాయ పరిమితిని రూ.10,000 నుంచి రూ.15,000కు పెంచారు.
{{/usCountry}}ఇంట్లో ద్విచక్ర వాహనం లేదా ఫ్రిజ్ ఉందనే కారణంతో గతంలో అర్హత కోల్పోయిన వారికి కూడా ఇప్పుడు పథకాన్ని వర్తింపజేస్తున్నారు. లబ్ధిదారుల నమోదు ప్రక్రియను పారదర్శకంగా మార్చేందుకు ఆవాస్ ప్లస్ యాప్ ద్వారా సెల్ఫ్ సర్వే, జియో ట్యాగింగ్ సౌకర్యం అందుబాటులోకి తెచ్చారు.
రాబోయే 2 నుంచి 3 ఏళ్ల వ్యవధిలో కొత్త, పాత ఇళ్లన్నింటినీ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి పేదవానికి పక్కా ఇల్లు అందిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.