...
...
Next Story

ఇక నరసాపురం వరకు వందేభారత్‌ ట్రైన్ - ఈనెల 15 నుంచే ప్రారంభం, ఆగే స్టేషన్‌లు ఇవే

చెన్నై సెంట్రల్‌- విజయవాడ మధ్య నడిచే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ను నర్సాపురం వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సర్వీసులు ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ మేరకు ట్రైన్ టైమింగ్ వివరాలను పేర్కొంది.

Published on: Dec 11, 2025, 14:07:26 IST
Advertisement

వందే భారత్ ట్రైన్ సర్వీసులపై గోదావరి జిల్లాల ప్రజలకు రైల్వే శాఖ శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ చెన్నై-విజయవాడ మధ్య తిరుగుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్…. ఇకపై నరసాపురం వరకూ ప్రయాణించనుంది. అయితే ఈ సర్వీస్ ప్రారంభ తేదీలపై రైల్వే శాఖ తాజాగా ప్రకటన చేసింది.

ఈనెల 15 నుంచి ప్రారంభం…

నరసాపురం వరకు వందేభారత్‌ ట్రైన్
నరసాపురం వరకు వందేభారత్‌ ట్రైన్

ఈ నెల 15వ తేదీ నుంచి నరసాపురం వరకు వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. చెన్నై లో 5.30 గంటలకు బయలుదేరి ( ట్రైన్ నెంబర్ - 20677) రైలు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి స్టేషన్లో ఆగుతుంది. విజయవాడలో 11.45 గంటలకు, మధ్యాహ్నం 12:34 గంటలకు గుడివాడ, 1:29 గంటలకు భీమవరం టౌన్ చేరుకుని మధ్యాహ్నం 2:10 గంటలకు నర్సాపురం చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలోరైలు (ట్రైన్ నెంబర్ 20678) నర్సాపురం నుంచి మధ్యాహ్నం 2:50 గంటలకు బయలుదేరి 3:19 గంటలకు భీమవరం టౌన్ చేరుకుంటుంది. అక్కడ్నుంచి 4:09 గంటలకు గుడివాడ, 4:50 గంటలకు విజయవాడకు, రాత్రి 11.45 గంటలకు చెన్నైకి చేరుకుంటుంది.

కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమలశాఖ సహాయమంత్రి (నర్సాపురం ఎంపీ) భూపతిరాజు ​శ్రీనివాస వర్మ చాలా రోజులుగా ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ కోసం పట్టుబడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ కూడా హామీనిచ్చారు. నర్సాపురానికి వందే భారత్ ట్రైన్ తీసుకువస్తాని చెప్పారు. ఆ తర్వాత నర్సాపురం నుంచి విజయం సాధించిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మ…. పలుమార్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లారు.

సర్వీస్ పొడిగింపుపై కసరత్తు పూర్తి చేసిన రైల్వేశాఖ అధికారులు… తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో నరసాపురం వరకు వందే భారత్ ట్రైన్ రాకపోకలు కొనసాగించనుంది. ఈనెల 15వ తేదీ నుంచి అధికారికంగా ఈ సేవలు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. వందే భారత్ ట్రైన్ సర్వీసులు అందుబాటులోకి వస్తుండటంపై గోదావరి జిల్లాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe