భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన తొలి విమానం ల్యాండింగ్ విజయవంతం అయిన శుభ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు సీఎం చంద్రబాబు. 2014 - 2019 మధ్య కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన ఈ విమానాశ్రయ నిర్మాణం ఈ ఏడాది జూన్ నాటికి మిగిలిన 4 శాతం పనులు కూడా పూర్తి చేసుకుని ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. 18 నెలల కాలంలో విమానాశ్రయ పనులు వేగంగా పూర్తి చేసి అందుబాటులోకి రావడానికి కారణమైన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీ గారికి ధన్యవాదలు తెలిపారు చంద్రబాబు.

'భోగాపురం ఎయిర్ పోర్టు ఆ ప్రాంత కనెక్టివిటీ పెంచి అభివృద్దికి దోహద పడుతుంది. పోర్టులు, ఎయిర్ పోర్టులు, నేషనల్ హైవేలు, ఐటీ సహా వివిధ రంగాలకు చెందిన అంతర్జాతీయ సంస్థల రాకతో ఉత్తరాంధ్ర దశ దిశ మారబోతోంది. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి సంకల్పంతో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం కోరుకుంటూ.. ఈ శుభసందర్భాన ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను.' అని చంద్రబాబు అన్నారు.
ఆంధ్రప్రదేశ్కు ఒక మైలురాయి రోజు అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విజయవంతమైన ధ్రువీకరణ విమానం కనెక్టివిటీని పెంచడంలో, ఉత్తరాంధ్ర వృద్ధి సామర్థ్యాన్ని పెంచడంలో చేయడంలో నిర్ణయాత్మక అడుగును సూచిస్తుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన దార్శనికత, నాయకత్వానికి ధన్యవాదాలన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం(2014–19) హయాంలో రూపొందించబడి ప్రారంభించిన ఈ విమానాశ్రయం జూన్ 2026 నుండి వాణిజ్య కార్యకలాపాలకు సిద్ధంగా ఉంటుందన్నారు. ఉత్తరాంధ్రను కొత్త శిఖరాలకు తీసుకెళుతుందని చెప్పారు.
ఈ రోజు భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్ అయింది. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి భోగాపురానికి ఎయిరిండియా వ్యాలిడేషన్ (టెస్ట్) ఫ్లైట్ చేరుకుంది. ఈ టెస్టింగ్ ఫ్లైట్లో కేంద్రమంత్రి రామ్మోహన్, ఎంపీ కలిశెట్టి, ఏటీసీ ఛైర్మన్ ప్రయాణం చేశారు. అత్యాధునిక టెక్నాలజీతో భోగాపురం విమానాశ్రయం నిర్మితమవుతోంది. జూన్లో విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. జీఎంఆర్ సంస్థ ఈ పనులను చేపట్టింది. 280 కి.మీ వేగంతో వీచే తుపాను గాలులను తట్టుకునేలా విమానాశ్రయ నిర్మాణం చేపట్టారు.
రన్వే, టెర్మినల్ భవనాలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, భద్రతా వ్యవస్థ తదితర కీలక మౌలిక సదుపాయాల కల్పన పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే జనవరి 4, 2026న తొలి కమర్షియల్ ఫ్లైట్ ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి అయింది.
{{/usCountry}}రన్వే, టెర్మినల్ భవనాలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, భద్రతా వ్యవస్థ తదితర కీలక మౌలిక సదుపాయాల కల్పన పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే జనవరి 4, 2026న తొలి కమర్షియల్ ఫ్లైట్ ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి అయింది.
{{/usCountry}}