CM Chandrababu Naidu Review : రాష్ట్రంలో ఇందన కొరతతో వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు. అయితే ఈ పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యవసర సమీక్ష నిర్వహించారు. సమస్య పరిష్కారానికి ఆదివారం రాత్రి నుంచి ఇప్పటి వరకు తీసుకున్న చర్యలేమిటని ఆరా తీశారు.

ఉదయం నుంచి వివిధ ఆయిల్ డిస్పాచ్ సెంటర్ల నుండి వందలాది ట్యాంకర్లు బయలుదేరాయని…. అవి ఈ రోజు సాయంత్రం నాటికి అన్ని రిటైల్ బంకులకు చేరుకుంటాయని ఆయిల్ కంపెనీల ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ రోజు సాయంత్రం కల్లా మెజారిటీ ప్రాంతాల్లో ఇంధన సరఫరా సాధారణ స్థితికి వస్తుందని హామీ ఇచ్చారు. అధికారులు, చమురు సంస్థలు సమన్వయంతో పనిచేసి ప్రజల ఆందోళనను తొలగించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ప్రతి 3 గంటలకోసారి నివేదిక….
కేవలం కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడం కాకుండా, కలెక్టర్లు మరియు ఉన్నతాధికారులు స్వయంగా ఆయిల్ డిస్పాచ్ సెంటర్లకు వెళ్లి పర్యవేక్షించాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పరిస్థితులను రియల్ టైమ్ గవర్నెన్స్ (RTGS) సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
“జిల్లాల్లో పరిస్థితులపై ఆర్టీజీ సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షించి ప్రతీ 3 గంటలకు ఒకసారి నివేదిక ఇవ్వాలి. ఆయిల్ డిపోల నుంచి రిటైల్ బంకులకు ఎటువంటి జాప్యం లేకుండా ఆయిల్ ట్యాంకర్లు చేరుకునే విధంగా చూడాలి. బ్లాక్ మార్కెట్, కృత్రిమ కొరత సృష్టించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి” అని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
బ్లాక్ మార్కెట్ చేస్తే ఉక్కుపాదమే!
కొరతను సాకుగా చూపి అక్రమ నిల్వలకు పాల్పడే వారిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. "బ్లాక్ మార్కెట్ లేదా కృత్రిమ కొరత సృష్టించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి" అని పోలీసు మరియు సివిల్ సప్లై అధికారులను ఆదేశించారు. డిపోల నుంచి బంకులకు వెళ్లే ట్యాంకర్లకు ఎటువంటి జాప్యం కలగకుండా చూడాలని…. సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు ఆయిల్ కంపెనీలు విరామం లేకుండా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
{{/usCountry}}కొరతను సాకుగా చూపి అక్రమ నిల్వలకు పాల్పడే వారిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. "బ్లాక్ మార్కెట్ లేదా కృత్రిమ కొరత సృష్టించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి" అని పోలీసు మరియు సివిల్ సప్లై అధికారులను ఆదేశించారు. డిపోల నుంచి బంకులకు వెళ్లే ట్యాంకర్లకు ఎటువంటి జాప్యం కలగకుండా చూడాలని…. సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు ఆయిల్ కంపెనీలు విరామం లేకుండా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
{{/usCountry}}