విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది నీటి ప్రవాహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి తన నివాసానికి వెళ్తుండగా…. బ్యారేజీ వద్ద కాన్వాయ్ను కొద్దిసేపు ఆపారు. బ్యారేజీపై నిలబడి నదిలో నీటి మట్టాన్ని, ప్రవాహ వేగాన్ని ఆయనే స్వయంగా వీక్షించారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ అధికారులు ప్రకాశం బ్యారేజీకి వస్తున్న వరద నీటి వివరాలను, డెల్టా కాలువలకు విడుదల చేస్తున్న నీటి పరిమాణాన్ని ముఖ్యమంత్రికి వివరంగా అందించారు.
పట్టిసీమతో కృష్ణా డెల్టాకు జలకళ….

ఈ వర్షాకాల సీజన్లో పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఇప్పటివరకు 17.52 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా నదికి విజయవంతంగా తరలించినట్లు అధికారులు సీఎంకు వివరించారు. గోదావరి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా ప్రవాహాలు వస్తున్నాయని….. అందువల్ల ఇప్పటివరకు 521 టీఎంసీల గోదావరి నీరు సముద్రంలోకి వెళ్లి కలిసిందని తెలిపారు.
గోదావరి జలాలు పట్టిసీమ ద్వారా ప్రకాశం బ్యారేజీకి సమృద్ధిగా చేరుతుండటంతో కృష్ణా డెల్టాలోని వ్యవసాయ రంగానికి ఎంతో మేలు జరుగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. బ్యారేజీ దిగువన ఉన్న వివిధ ప్రధాన కాలువల ద్వారా రైతుల పంట పొలాలకు సాగునీటిని నిరంతరాయంగా విడుదల చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
డెల్టా ఆయకట్టు స్థిరీకరణలో భాగంగా ప్రకాశం బ్యారేజీ నుంచి కాలువలకు నీటి పరిమాణాన్ని అధికారులు క్రమబద్ధీకరించారు.
- కృష్ణా తూర్పు ప్రధాన కాలువ ద్వారా 3,928 క్యూసెక్కుల నీటిని వదిలారు.
- కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువ ద్వారా 3,115 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
- గుంటూరు ఛానల్ ద్వారా 115 క్యూసెక్కుల నీటిని పంపించారు.
మొత్తంగా కృష్ణా డెల్టా పరిధిలోని పంటల సాగు నీటి అవసరాల కోసం అన్ని ప్రధాన కాలువల ద్వారా కలిపి 7,158 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి జలాలు తోడవ్వడంతో ఈ ఏడాది డెల్టా రైతన్నలకు సాగునీటి కొరత ఉండదని అధికారులు భావిస్తున్నారు.
{{/usCountry}}మొత్తంగా కృష్ణా డెల్టా పరిధిలోని పంటల సాగు నీటి అవసరాల కోసం అన్ని ప్రధాన కాలువల ద్వారా కలిపి 7,158 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి జలాలు తోడవ్వడంతో ఈ ఏడాది డెల్టా రైతన్నలకు సాగునీటి కొరత ఉండదని అధికారులు భావిస్తున్నారు.
{{/usCountry}}