Vijayawada : కృష్ణా నదిలో నైట్ బోటింగ్ - సర్కార్ గ్రీన్ సిగ్నల్, ఈ రూల్స్ మాత్రం తప్పనిసరి!
విజయవాడ కృష్ణా నదిలో రాత్రిపూట బోటింగ్ సర్వీసులకు ఏపీ జలవనరుల శాఖ షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. పున్నమి ఘాట్ నుంచి భవానీ ఐలాండ్ వరకు రాత్రి 10 గంటల వరకు పర్యాటకులు నదీ విహారం చేయవచ్చు.
Vijayawada Night Boating : పర్యాటక రంగానికి మరింత ఊపునిచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడలోని కృష్ణా నదిలో రాత్రివేళ బోటు షికారు (నైట్ క్రూజింగ్) చేసేందుకు పర్యాటక శాఖకు జలవనరుల శాఖ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు (GO) జారీ అయ్యాయి.

ఈ కొత్త నిర్ణయంతో పర్యాటకులు అమరావతి రాజధాని ప్రాంతం, పున్నమి ఘాట్, భవానీ ఐలాండ్ పరిసరాల్లో రాత్రి 10 గంటల వరకు కృష్ణా నదిలో హాయిగా విహరించవచ్చు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (APTDC) ఆధ్వర్యంలో ఈ బోటింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
భద్రత విషయంలో కఠిన నిబంధనలు
పర్యాటకుల రక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ఈ అనుమతులతో పాటు అనేక కఠిన నిబంధనలను విధించింది. నది పరివాహక ప్రాంతం, నీటి విడుదల నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తూనే ఈ విహారానికి అనుమతి ఇచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది.
- ప్రకాశం బ్యారేజ్ గేట్ల నిర్వహణ, నీటి ప్రవాహ నియంత్రణకు మొదటి ప్రాధాన్యం ఉంటుంది. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో లేదా నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు బోటింగ్ సేవలను తక్షణమే నిలిపివేస్తారు.
- వరద ప్రమాదం, ప్రతికూల వాతావరణం లేదా జలవనరుల శాఖ హెచ్చరికలు జారీ చేసిన సమయంలో రాత్రిపూట బోటింగ్ నిర్వహించడానికి వీల్లేదు.
- బోట్లు ప్రయాణించే మార్గాన్ని ప్రకాశవంతమైన వెలుగులు చిమ్మే లైటింగ్ సూచికలు , బ్లింకర్లతో స్పష్టంగా గుర్తించాలి. ఈ కేటాయించిన మార్గం దాటి బోట్లు మరెక్కడికీ వెళ్లకూడదు.
- కృష్ణా నదిపై ఆధారపడి జీవించే స్థానిక మత్స్యకారుల హక్కులకు భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలి. వారి చేపల వలలకు ఎలాంటి నష్టం కలగకుండా పర్యాటక శాఖ తగిన జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది.
- ప్రకాశం బ్యారేజీకి ఎగువన 1000 మీటర్ల (1 కిలోమీటరు) పరిధిలో ఎలాంటి బోట్లనూ అనుమతించబోరు.
ఈ నిబంధనలన్నీ కచ్చితంగా పాటిస్తూ పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. విజయవాడ రాత్రి శోభను, కృష్ణా నది అందాలను తిలకించాలనుకునే వారికి ఇది నిజంగా మంచి అవకాశమని చెప్పవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

