ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, ఆర్థిక పురోగతికి అమరావతి రాజధాని నగర నిర్మాణమే తొలి విజయ సోపానమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సీడ్ యాక్సెస్ రహదారి ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అంతకుముందు సీడ్ యాక్సెస్ రోడ్డును అనుసంధానించే స్టీల్ బ్రిడ్జీల ప్రారంభానికి సూచికగా ఉండవల్లి వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. విభజన గాయాల నుంచి కోలుకుని, భూములిచ్చిన రైతుల త్యాగాల పునాదులపై నిర్మితమవుతున్న అమరావతి ఇకపై ఏ శక్తుల వల్లా ఆగదని, ప్రపంచ అత్యుత్తమ నగరాల సరసన నిలుస్తుందని అన్నారు.

సీడ్ యాక్సెస్ రోడ్డుతో రాజధాని నిర్మాణానికి కీలక మలుపు జరుగుతుందన్నారు. మూడో దశలో తాడేపల్లి వద్ద జాతీయ రహదారితో అనుసంధానం అవుతుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీగా రూపాంతరం అమరావతి చెందనుందన్నారు. 2028 నాటికి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రపంచ స్థాయి రాజధానిగా ప్రారంభోత్సవం అవుతుందన్నారు.
భూములిచ్చిన రైతులకు చంద్రబాబు నమస్కరిస్తూ.. రాజధాని పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని వెల్లడించారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రగతి కోసం పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుజాతి గర్వపడేలా సైబరాబాద్ నగర నిర్మాణం జరిగిందని, విభజన తర్వాత రాజధాని కూడా లేక ఏపీ తీవ్రంగా నష్టపోయిందని సీఎం గుర్తుచేశారు. రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాలకు సరిగ్గా మధ్యలో ఉండే గుంటూరు జిల్లా పరిధిలో రాజధాని ఏర్పాటు చేయాలని సంకల్పించామని తెలిపారు.
'సుదీర్ఘ చర్చల తర్వాత ప్రభుత్వంపై నమ్మకంతో పవిత్రమైన రాజధాని నిర్మాణం కోసం తమ అమూల్యమైన భూములను త్యాగం చేసిన రైతులందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. సింగపూర్ బృహత్ ప్రణాళిక, లండన్కు చెందిన ప్రఖ్యాత నార్మన్ ఫాస్టర్స్ డిజైన్లతో అమరావతి కాంప్లెక్స్ భవనాలను యూనీక్గా రూపొందించాం. గతంలో కొందరు వీటిని గ్రాఫిక్స్ అని ఎగతాళి చేశారు. నేడు ఆ గ్రాఫిక్స్ నిజ రూపం దాలుస్తుంటే ఎగతాళి చేసిన వారంతా తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.' అని చంద్రబాబు అన్నారు.
అసెంబ్లీ సాక్షిగా రాజధానికి 40 వేల ఎకరాలు కావాలని మద్దతు తెలిపిన వ్యక్తి, అధికారంలోకి వచ్చాక 'మూడు రాజధానులు' అని మాట మార్చడాన్ని ప్రజలు గమనించారని చంద్రబాబు విమర్శించారు. 2019-24 మధ్యకాలంలో రైతులు చేసిన అమరావతి ఉద్యమం చారిత్రాత్మకమైనదని, ఆ పోరాటానికి తాము కూడా జోలె పట్టి సహకరించామని సీఎం గుర్తు చేసుకున్నారు.
{{/usCountry}}అసెంబ్లీ సాక్షిగా రాజధానికి 40 వేల ఎకరాలు కావాలని మద్దతు తెలిపిన వ్యక్తి, అధికారంలోకి వచ్చాక 'మూడు రాజధానులు' అని మాట మార్చడాన్ని ప్రజలు గమనించారని చంద్రబాబు విమర్శించారు. 2019-24 మధ్యకాలంలో రైతులు చేసిన అమరావతి ఉద్యమం చారిత్రాత్మకమైనదని, ఆ పోరాటానికి తాము కూడా జోలె పట్టి సహకరించామని సీఎం గుర్తు చేసుకున్నారు.
{{/usCountry}}అమరావతి కేవలం పరిపాలనా నగరమే కాకుండా, పూర్తిగా కాలుష్య రహిత డీప్ టెక్ క్యాపిటల్గా మారబోతోందని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఏఐ, క్వాంటమ్ కంప్యూటర్ వ్యాలీగా ప్రపంచంలోనే అగ్రగామి టాప్-5 నగరాల్లో ఒకటిగా అమరావతి రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. అమరావతి, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడ కార్పొరేషన్లు రాజధాని మహానగర పరిధిలోనే భాగమవుతాయన్నారు.
190 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు, 96 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు చంద్రబాబు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలంతా చేతిలో జాతీయ జెండా, మనస్సులో నిర్దిష్టమైన అజెండాతో ముందుకు సాగాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రతి ఇల్లు, వాణిజ్య సముదాయంపైనా త్రివర్ణ పతాకం ఎగరవేయాలన్నారు.
'అమరావతి నిర్మాణంలో సీడ్ యాక్సెస్ రహదారి, స్టీల్ బ్రిడ్జిలు తొలి మెట్టు మాత్రమే. రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడే శక్తులతో అప్రమత్తంగా ఉంటూ, హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీని సాధించడమే మన అందరి లక్ష్యం కావాలి.' అని సీఎం చంద్రబాబు అన్నారు.