క్వాంటం వ్యాలీకి ఆతిథ్యం ఇచ్చే గ్రీన్ఫీల్డ్ రాజధాని నగరం అమరావతిని ప్రపంచంలోని టాప్ ఐదు క్వాంటం కంప్యూటింగ్ హబ్లలో ఒకటిగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు రాష్ట్ర క్వాంటం విజన్ను ఆవిష్కరించారు. వేలాది మంది విద్యార్థులను వర్చువల్గా ఉద్దేశించి క్వాంటమ్ టాక్లో ముఖ్యమంత్రి ప్రసంగించారు.

ఆంధ్రప్రదేశ్ తదుపరి తరం నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి, వేలాది అధిక-విలువైన ఉద్యోగాలను సృష్టించడానికి, ఉత్పత్తి-కేంద్రీకృత విధానాన్ని అవలంబించడానికి, అన్ని రకాల క్వాంటం కంప్యూటర్లను అభివృద్ధి చేయడానికి, క్వాంటం కంప్యూటర్ల తయారీలో పూర్తి సరఫరా గొలుసును సాధించడానికి కృషి చేస్తుందని నొక్కి చెప్పారు. అన్ని రంగాల్లోనూ క్వాంటమ్ కంప్యూటింగ్ పనిచేయబోతోందన్నారు.
'ఆంధ్రప్రదేశ్ విజన్: అమరావతిలో క్వాంటం వ్యాలీ. ఆంధ్రప్రదేశ్ ఫాలో కాదు, మేం నాయకత్వం వహిస్తాం. అమరావతిలో క్వాంటం కంప్యూటర్లను ఉత్పత్తి చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. 80 శాతం లేదా 85 శాతం కాంపోనెంట్ భాగస్వాములు సిద్ధంగా ఉన్నారు.' అని చంద్రబాబు అన్నారు.
రెండేళ్లలోపు అమరావతిలో క్వాంటం కంప్యూటర్లు ఉత్పత్తి అవుతాయని, ఎవరైనా ఏదైనా నాలెడ్జ్ కంపెనీ లేదా టెక్నాలజీని ప్రారంభించాలనుకుంటే అమరావతికి రావాలని ముఖ్యమంత్రి చెప్పారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో జరిపిన పరిశోధనలకు క్వాంటం కంప్యూటింగ్లో నోబెల్ బహుమతి పొందిన ఎవరికైనా రూ.100 కోట్ల బహుమతిని ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆవిష్కరణ, ఉత్పత్తి ఆధారిత భవిష్యత్తుకు గురించి ఆలోచించాలని చెప్పారు.
1971లో చైనా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిందని, భారత్లో 1991లో ఆ సంస్కరణలు వచ్చాయన్నారు చంద్రబాబు. ఆ తర్వాత ఎక్కడా వెనక్కు తిరిగి చూడలేదని చెప్పారు. సామాన్యుల సాధికారతే లక్ష్యంగా.. మోదీ ప్రభుత్వం సంస్కరణలు తీసుకొస్తుందన్నారు. విశాఖకు చాలా ఐటీ కంపెనీలు వచ్చాయన్నారు. భవిష్యత్తులో నాలెడ్జ్ ఎకానమీ, టెక్నాలజీ చిరునామాగా మారబోతోందన్నారు.
'వచ్చే 20 ఏళ్లలో రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో ఇప్పుడే కార్యరూపం ఇస్తున్నాం. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ద్వారా ఎకో సిస్టమ్ తయారు చేయాలని ప్రభుత్వ లక్ష్యం. భారత్లో నైపుణ్యాలు ఉన్నా.. క్వాంటమ్ రంగంలో మరింత పెట్టుబడుల విస్తృతి పెరగాల్సి ఉంది. నేషనల్ క్వాంటమ్ మిషన్ ద్వారా పెద్ద ఎత్తున ఈ రంగంలో పెట్టుబడులు, నేపుణ్య కల్పన కోసం కేంద్రం ప్రయత్నిస్తోంది. ఐటీ విప్లవం లాగా.. ప్రపంచవ్యాప్తంగా క్వాంటమ్ విప్లవాన్ని భారతీయులు అందిపుచ్చుకోవాలి.' అని చంద్రబాబు అన్నారు.
{{/usCountry}}'వచ్చే 20 ఏళ్లలో రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో ఇప్పుడే కార్యరూపం ఇస్తున్నాం. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ద్వారా ఎకో సిస్టమ్ తయారు చేయాలని ప్రభుత్వ లక్ష్యం. భారత్లో నైపుణ్యాలు ఉన్నా.. క్వాంటమ్ రంగంలో మరింత పెట్టుబడుల విస్తృతి పెరగాల్సి ఉంది. నేషనల్ క్వాంటమ్ మిషన్ ద్వారా పెద్ద ఎత్తున ఈ రంగంలో పెట్టుబడులు, నేపుణ్య కల్పన కోసం కేంద్రం ప్రయత్నిస్తోంది. ఐటీ విప్లవం లాగా.. ప్రపంచవ్యాప్తంగా క్వాంటమ్ విప్లవాన్ని భారతీయులు అందిపుచ్చుకోవాలి.' అని చంద్రబాబు అన్నారు.
{{/usCountry}}