దేవరపల్లి ఆశ్రమ బాలుర హాస్టల్లో విద్యార్థుల అస్వస్థత.. సీఎం చంద్రబాబు సీరియస్
దేవరపల్లి ఆశ్రమ బాలుర హాస్టల్లో విద్యార్థుల అస్వస్థతపై అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. సోమవారంలోపు సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
పోలవరం జిల్లా రంపచోడవరంలోని దేవరపల్లి ఆశ్రమ బాలుర వసతి గృహంలో 92 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. విద్యార్థులకు వాంతులు, కడుపు నొప్పి, జ్వరం, విరేచనాలు వంటి లక్షణాలు కనిపించాయని, వారిని త్వరగా మారేడుమిల్లి, రంపచోడవరం ఆసుపత్రులకు తరలించామని ముఖ్యమంత్రికి అధికారులు తెలియజేశారు.

శనివారం ఉదయం అల్పాహారం తర్వాత విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు వివరించారు. హాస్టల్ను వెంటనే తనిఖీ చేసి, మిగిలిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించినట్లు నివేదించారు. విరేచనాల లక్షణాలు కనిపిస్తున్న వారికి వైద్య చికిత్స అందిస్తున్నారు. ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. పరిశీలించేందుకు హాస్టల్ నుండి ఆహారం, నీటి నమూనాలను సేకరించారు.
ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. రంపచోడవరం ఆసుపత్రిలో విద్యార్థుల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఈ విషయంపై సోమవారంలోపు సమగ్ర నివేదికను కలెక్టర్ సమర్పించాలని కూడా చెప్పారు.
సోమవారం నాటికి వివరణాత్మక నివేదికను సమర్పించాలని, నిర్లక్ష్యానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీని కూడా ఏర్పాటు అయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, వారి పరిస్థితి గురించి తనకు క్రమం తప్పకుండా తెలియజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సోమవారం నాటికి ఈ సంఘటనపై సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించారు.
ఈ సంఘటనకు బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు చెప్పారు.

E-Paper












