మెుంథా తుపానుతో ఏపీలో భారీ వర్షాలు పడనున్నాయి. ఈ కారణంగా ఏపీ ప్రభుత్వం పలు జిల్లాల విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే విశాఖపట్నం, అనకాపల్లి, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఈ నెల 27 నుంచి రెండురోజులపాటు సెలవు ఇచ్చారు. సీఎం చంద్రబాబ ఆదేశాల మేరకు విశాఖపట్నం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీలకు ఈ నెల 27, 28వ తేదీల్లో సెలవులు ప్రకటిస్తూ.. జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. పరిస్థితుల ఆధారంగా తర్వాత కూడా సెలవులు పొడిగించే అవకాశం ఉంది.

మరోవైపు అనకాపల్లి జిల్లాలో విద్యాసంస్థలకు 27, 28, 29 తేదీల్లో మూడు రోజులపాటు సెలవులు ఇస్తూ కలెక్టర్ విజయ కృష్ణన్ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి.. విద్యా సంస్థలను తెరిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 27, 28వ తేదీల్లో సెలవులు ప్రకటించారు. కడప అన్నమయ్య జిల్లాల్లో 27, 28 తేదీల్లో సెలవులు ఇచ్చారు. బాపట్ల, గుంటూరు సెలవులు ఇవ్వగా.. కృష్ణా జిల్లాలో 27, 28, 29 తేదీల్లో సెలవులు ఉంటాయి. ఇక కాకినాడ జిల్లాలో ఐదు రోజుల పాటు సెలవు ప్రకటించారు.
తుపాను తీవ్రతను ఆధారంగా చేసుకుని విద్యాసంస్థలకు కలెక్టర్లు సెలవులు ప్రకటించాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆదేశించారు. మెుంథా తుపాను ప్రభావంతో అక్టోబర్ 28, 29 తేదీల్లో తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఏపీకి ఇప్పటికే హై అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు దంచికొట్టనున్నాయి. తెలంగాణ అంతటా కూడా దీని ప్రభావం ఉండనుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం అక్టోబర్ 28 ఉదయం నాటికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. అక్టోబర్ 28 సాయంత్రం లేదా రాత్రి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య తీరాన్ని దాటుతుందని, గంటకు 90–110 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని అంచనా.
ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అన్ని జిల్లాల యంత్రాంగాలను, ముఖ్యంగా తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని, మెుంథా తుపాను ప్రభావం అధికంగా ఉండే ప్రాంతాల్లోని ప్రజలను అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఐఎండీ బులెటిన్ల ద్వారా ప్రజలకు సమాచారం అందించాలని, సోషల్ మీడియాలో ధృవీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అత్యవసరం సాయం కోసం 112, 1070, 1800 425 0101 నంబర్లకు ఫోన్ చేయాలి. ఇప్పటికే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తుపాను గురించి సూచనలు జారీ చేసింది. ఈ లింక్ క్లిక్ చేసి చదవండి.
{{/usCountry}}ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అన్ని జిల్లాల యంత్రాంగాలను, ముఖ్యంగా తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని, మెుంథా తుపాను ప్రభావం అధికంగా ఉండే ప్రాంతాల్లోని ప్రజలను అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఐఎండీ బులెటిన్ల ద్వారా ప్రజలకు సమాచారం అందించాలని, సోషల్ మీడియాలో ధృవీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అత్యవసరం సాయం కోసం 112, 1070, 1800 425 0101 నంబర్లకు ఫోన్ చేయాలి. ఇప్పటికే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తుపాను గురించి సూచనలు జారీ చేసింది. ఈ లింక్ క్లిక్ చేసి చదవండి.
{{/usCountry}}