ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరగడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య 32కి చేరడంతో ఈ ఇన్ఫెక్షన్ తీవ్రత ఎంతవరకు ఉంది? తిరిగి మాస్కులు ధరించాల్సిన సమయం వచ్చిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశాలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) నేషనల్ కోవిడ్ టాస్క్ ఫోర్స్ కో-ఛైర్మన్ డాక్టర్ రాజీవ్ జయదేవన్ స్పందిస్తూ.. ఇది ఆసుపత్రులు నిండిపోయి, ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే రకం వేవ్ కాదని స్పష్టం చేశారు.

'కోవిడ్-19 వైరస్ క్రమానుగత వ్యవధిలో వ్యాపించే తత్వం కలిగి ఉంటుంది. అందుకే కేసులలో పెరుగుదల కనిపించడం సాధారణమే. ఒమిక్రాన్ వేవ్ వచ్చిన 2022 తర్వాత నుంచి మన ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి తెచ్చే స్థాయి ఘటనలేవీ నమోదు కాలేదు.' అని ఆయన తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఏడాదీ ఇలాంటి తాత్కాలిక పెరుగుదల చూస్తున్నామని, ఇది కూడా మరో రెండు నెలల్లో తగ్గిపోతుందని వివరించారు.
వైరస్ వేరియంట్ల గురించి వివరిస్తూ.. 2021లో డెల్టా, 2022లో ఒమిక్రాన్ ప్రభావం చూపాయని తెలిపారు. ఆ తర్వాత వచ్చిన వేరియంట్లన్నీ ఒమిక్రాన్ సంతతికి చెందినవేనని పేర్కొన్నారు. నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ వైరాలజీ, పూణే నిర్వహించిన జీనోమ్ సీక్వెన్సింగ్లో వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఐదు నమూనాలలో RF.5 సబ్-లైనేజ్ ను గుర్తించారు.
ప్రస్తుతం ఏపీలో గుర్తించిన RF.5 తో సహా వచ్చిపోయే ఉప-వేరియంట్లన్నీ ఒమిక్రాన్ ఉత్పన్నాలేనని, వీటి పేర్లు వేరైనా వీటి లక్షణాలు ఒకేలా ఉంటాయని, ఏదీ కూడా మరొకదాని కంటే తీవ్రమైన వ్యాధిని కలిగించదని వైద్యులు తెలిపారు.
వేరియంట్ల రకాలు: 2022: XBB వేరియంట్, 2023 BA.2.86 (రూపాంతరం చెంది JN.1 గా మారింది), 2024 JN.1 డెరివేటివ్స్, 2025 NB.1.8.1 వేరియంట్, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా XFG, BA.3.2, RF.5 వేరియంట్లు ప్రచారంలో ఉన్నాయి. RF.5 అనేది JN.1 యొక్క రూపాంతరం.
ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులకు ఈ సబ్-లైనేజ్ వల్ల ప్రాణాపాయం లేకపోయినా, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణ జ్వరం కూడా గుండెపై ఒత్తిడి తెస్తుందని, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఇది ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్కులు ధరించాలని సూచించారు.
{{/usCountry}}ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులకు ఈ సబ్-లైనేజ్ వల్ల ప్రాణాపాయం లేకపోయినా, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణ జ్వరం కూడా గుండెపై ఒత్తిడి తెస్తుందని, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఇది ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్కులు ధరించాలని సూచించారు.
{{/usCountry}}మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఎ. విష్ణు వర్ధన్ మాట్లాడుతూ.. సింగపూర్, ఆగ్నేయాసియా దేశాల్లో RF.5 కేసులు ఎక్కువగా నమోదయ్యాయని, అయితే ఇది ప్రమాదకరమైనది కాదని చెప్పారు. గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, తలనొప్పి, ముక్కు కారడం లేదా మూసుకుపోవడం, నీరసం, ఒళ్లు నొప్పులు దీని ప్రధాన లక్షణాలని తెలిపారు.
పరిస్థితిని సమీక్షించేందుకు ఏపీ ఆరోగ్య శాఖ కార్యదర్శి జి. వీరపాండియన్ సంబంధిత అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో టెస్టింగ్ కిట్లు, మందులు, కోవిడ్ ప్రత్యేక బెడ్లు, పీపీఈ కిట్లు, అత్యవసర వైద్య సామాగ్రి అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే స్వల్ప లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని అధికారులు సూచించారు.