మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. తెల్లవారుజాము నుంచి భక్తుల రద్దీ షురూ అయింది. ప్రధాన ఆలయాలతో పాటు మిగతా ఆలయాల్లో కూడా సందడి నెలకొంది.

ఏపీలోని శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారామం, కోటప్పకొండ వంటి క్షేత్రాలకు లక్షలాది మంది తరలివస్తున్నారు. తెలంగాణలో వేములవాడ, కాళేశ్వరం, కీసర, రామప్ప, వేయ్యి స్తంభాల గుడి, చెర్వుగట్టు వంటి ఆలయాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, జాగరణలతో శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.
శ్రీశైలంలో భారీగా రద్దీ…
ప్రస్తుతం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అందులోనూ ఇవాళ మహాశివరాత్రి పర్వ దినం కావటంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తుల తరలివస్తున్నారు.దీంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి.
పాతాళగంగ వద్దకు భారీగా భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు చేస్తున్నారు. గంగాధర, నంది మండపం వద్ద కొబ్బరికాయలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. శ్రీశైలం పురవీధుల్లో శివనామస్మరణం మార్మోమోగుతోంది.
ఇక శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. భక్తుల రద్దీ దృష్ట్యా… ఇటీవలనే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 16 వరకు దేవస్థానం, అటవీశాఖ టోల్గేట్ల వద్ద రుసుం మినహాయింపు ఇస్తోంది. శ్రీశైలం వెళ్లే భక్తులు ప్రభుత్వం సూచిన చోట్ల ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఆలయం, అటవీశాఖ టోల్గేట్ల దగ్గర టోల్ చెల్లించకుండానే వెళ్లొచ్చు.
గత ఏడాది తరహాలోనే ఈ సంవత్సరం కూడా భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం పంపిణీ చేస్తున్నారు . ఇక సాధారణ సమయాల్లో రాత్రి సమయంలో శ్రీశైలం వెళ్లేందుకు అనుమతించరు. బ్రహ్మోత్సవాల రద్దీ వేళ రాత్రివేళల్లో కూడా రవాణా సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చారు.
శ్రీశైలంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. గత సంవత్సరం ఎదురైన లోపాలను సవరించడంతో పాటు…. భక్తుల రద్దీ దృష్ట్యా వచ్చే సమస్యలను ముందుగానే అంచనా వేసి పరిష్కార మార్గాలు సిద్ధంగా ఉంచుకునేలా కార్యాచరణను రూపొందించారు. ఈ మేరకు అధికారులు, పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు.
{{/usCountry}}శ్రీశైలంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. గత సంవత్సరం ఎదురైన లోపాలను సవరించడంతో పాటు…. భక్తుల రద్దీ దృష్ట్యా వచ్చే సమస్యలను ముందుగానే అంచనా వేసి పరిష్కార మార్గాలు సిద్ధంగా ఉంచుకునేలా కార్యాచరణను రూపొందించారు. ఈ మేరకు అధికారులు, పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు.
{{/usCountry}}