శ్రీశైలం వెళ్లే భక్తులకు అదిరిపోయే శుభవార్త - నేటి నుంచి టోల్‌ ఫ్రీ జర్నీ..! ఇవిగో వివరాలు

శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి వాహనాలకు టోల్ ఫ్రీ ఉండనుంది.ఫిబ్రవరి 16 వరకు దేవస్థానం, అటవీశాఖ టోల్‌గేట్ల వద్ద రుసుం మినహాయిస్తారు.

Published on: Feb 13, 2026 9:27 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శివరాత్రి దగ్గరపడిన నేపథ్యంలో బ్రహ్మోత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13 నుంచి 16 వరకు దేవస్థానం, అటవీశాఖ టోల్‌గేట్ల వద్ద రుసుం మినహాయింపు ఇవ్వనుంది.

శ్రీశైలం
శ్రీశైలం

టోల్ మినహాయింపు…

శ్రీశైలం వెళ్లే భక్తులు ప్రభుత్వం సూచిన చోట్ల ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఆలయం, అటవీశాఖ టోల్‌గేట్ల దగ్గర టోల్ చెల్లించకుండానే వెళ్లొచ్చు. ఈ మేరకు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రకటన విడుదల చేశారు.

ఉచితంగా లడ్డూలు…

గత ఏడాది తరహాలోనే ఈ సంవత్సరం కూడా భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం పంపిణీ చేయనున్నారు. నాల్గో రోజులపాటు ఈ అవకాశం ఉంటుంది. ఇక సాధారణ సమయాల్లో రాత్రి సమయంలో శ్రీశైలం వెళ్లేందుకు అనుమతించరు. బ్రహ్మోత్సవాల రద్దీ వేళ రాత్రివేళల్లో కూడా రవాణా సౌకర్యం అందుబాటులో ఉంటుందని కలెక్టర్ ప్రకటించారు.

శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన రోజు నుంచి గురువారం వరకు 2,59,050 మంది భక్తులు దర్శనాలు చేసుకున్నారు. మహాశివరాత్రి రోజు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. ఆ రోజు దాదాపు 1.50 లక్షల మంది భక్తులు విశ్రాంతి తీసుకునేలా అదనంగా చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు.

శ్రీశైలంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. గత సంవత్సరం ఎదురైన లోపాలను సవరించడంతో పాటు…. భక్తుల రద్దీ దృష్ట్యా వచ్చే సమస్యలను ముందుగానే అంచనా వేసి పరిష్కార మార్గాలు సిద్ధంగా ఉంచుకునేలా కార్యాచరణను రూపొందించారు. ఈ మేరకు అధికారులు, పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు.