ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులకు రూఫ్ టాప్ సోలార్ సిస్టం ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశించారు. అనంతపురంలోని కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో శనివారం పీఎం కుసుమ్, పీఎం సూర్యఘర్ పథకంతో పాటు మరికొన్నింటిపై సమీక్షించారు.
ఎటువంటి జాప్యం ఉండొద్దు - సీఎస్

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మాట్లాడుతూ….. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో 7.48 లక్షల ఎస్సీ/ఎస్టీ గృహ విద్యుత్ వినియోగదారులకు వచ్చే ఏడాది మార్చిలోగా ఫీజిబిలిటీ ఉన్న గృహాలపై రెండు కిలోవాట్ల చొప్పున మొత్తం 415 మెగావాట్ల సామర్థ్యంతో రూప్ టాప్ సోలార్ పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. సోలార్ ప్యానల్స్ ను అమర్చిన వెంటనే ఎటువంటి జాప్యం లేకుండా నెట్ మీటర్ ను ఏర్పాటు చేయాలని సూచించారు.
ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో పీఎం కుసుమ్ పథకం కింద 610 మెగావాట్ల సామర్థ్యంతో 1.36 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు సోలార్ విద్యుత్ పనులను పూర్తి చేయాలన్నారు. ఫీడర్ సోలరైజేషన్ పథకం కింద అనంతపురం సర్కిల్ పరిధిలోని 20 ప్రాంతాల్లో 498 ఎకరాల ప్రాంగణంలో 111 మెగావాట్ల సామర్ధ్యంతో సోలార్ ప్లాంట్ ల ఏర్పాటుకు సంబంధించి భూసేకరణను వేగవంతం చేయాలని అనంతపురం జిల్లా అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పీఎం సూర్యఘర్ పథకం కింద అనంతపురం జిల్లాలో 35.7 మెగావాట్ల సామర్థ్యంతో 17,870 గృహాలకు రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ ను ఏర్పాటు చేయాలని… ఈ పనులను వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి చేయాలని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా 21 లక్షల బీసీ గృహాలకు రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ ను అమర్చనున్నట్లు సీఎస్ తెలిపారు. పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని కోరారు. అలాగే ప్రస్తుతం జరుగుతున్న విద్యుత్తు పంపిణీ పునర్వ్యవస్థీకరణ పథకం (ఆర్.డి.ఎస్.ఎస్) కింద పనులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.
{{/usCountry}}రాష్ట్రవ్యాప్తంగా 21 లక్షల బీసీ గృహాలకు రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ ను అమర్చనున్నట్లు సీఎస్ తెలిపారు. పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని కోరారు. అలాగే ప్రస్తుతం జరుగుతున్న విద్యుత్తు పంపిణీ పునర్వ్యవస్థీకరణ పథకం (ఆర్.డి.ఎస్.ఎస్) కింద పనులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.
{{/usCountry}}రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో క్లిన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, పవన విద్యుత్, సోలార్ విద్యుత్ లాంటి పర్యావరణ హిత విద్యుత్ ను ప్రోత్సహిస్తూ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారని సీఎస్ గుర్తు చేశారు. ఇందుకనుగుణంగా నిర్దేశిత గడువులోగా కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు.