నైరుతి బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో 'దిత్వా' తుఫాన్ నెమ్మదిగా కదులుతోంది. గడిచిన 6 గంటల్లో 4 కి.మీ వేగంతో తుఫాన్ ముందుకు సాగిందని వాతావరణశాఖ తెలిపింది. పుదుచ్చేరికి 420 కి.మీ., చెన్నైకి 520 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొంది.

తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కోస్తా తీరం వెంబడి ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఎల్లుండికి నైరుతి బంగాళాఖాతం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాలకు తుఫాన్ చేరుకునే అవకాశం ఉంటుందని అంచనా వేసింది.
భారీ వర్షాలు….
ఈ ప్రభావంతో కోస్తా, రాయలసీమలో రేపు,ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని స్పష్టం చేసింది. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
సోమవారం దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. శని, ఆదివారాల్లో చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
తెలంగాణకు వర్ష సూచన:
తెలంగాణకు కూడా వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. నవంబర్ 29వ తేదీ నుంచి రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. నవంబర్ 30వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి.
భదాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక డిసెంబర్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలో మళ్లీ పొడి వాతావరణం ఉంటుంది.
{{/usCountry}}భదాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక డిసెంబర్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలో మళ్లీ పొడి వాతావరణం ఉంటుంది.
{{/usCountry}}