మొంథా తుపాను తీరాన్ని తాకింది. కాకినాడ- మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో తీరాన్ని తాకింది. గడిచిన 6 గంటల్లో గంటకు 17 కి.మీ వేగంతో తుపాన్ కదిలినట్లు ఐఎండీ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. పూర్తిగా తీరం దాటడానికి 3-4 గంటల సమయం పట్టొచ్చని అంచనా వేసింది.

కోస్తా వెంబడి గంటకు 90-100 కిమీ వేగంతో ఈదురగాలులు వీస్తున్నాయని ఐఎండీ హెచ్చరించింది. ప్రజలు సురక్షితంగా ఇంట్లోనే ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
బుధవారం(అక్టోబర్ 29) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు పడొచ్చు. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు పడుతాయి. ఇక కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీవర్షాలు కురుసే సూచనలున్నాయి. ఇక ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో 38 వేల హెక్టార్లలో పంటలు, 1.38 లక్షల హెక్టార్లలో ఉద్యానవన పంటలు ధ్వంసమయ్యాయి. దాదాపు 76,000 మందిని సహాయ శిబిరాలకు తరలించగా, ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో 219 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది.
తుఫాను ప్రభావిత కృష్ణా, ఏలూరు, కాకినాడ జిల్లాల్లో ఇవాళ రాత్రి 8.30 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు రోడ్లపై వాహనాల రాకపోకలను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అత్యవసర వైద్య సేవలకు మినహాయింపు ఉంటుంది. మరోవైపు విశాఖపట్నం విమానాశ్రయం నుంచి నడిచే మొత్తం 32 విమానాలను మంగళవారం రద్దు చేశారు. విజయవాడ విమానాశ్రయం 16 విమానాలు రద్దయ్యాయి.
రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లోని పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలను అక్టోబర్ ౩౦ వరకు మూసివేస్తున్నట్లు పరిపాలన ఇప్పటికే ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగుల సెలవులను కూడా అక్టోబర్ 30 వరకు రద్దు చేశారు. పరిస్థితులను బట్టి కొన్ని జిల్లాల్లో సెలవును పొడిగించే అవకాశం ఉంది.
సీఎం చంద్రబాబు సమీక్ష…
{{/usCountry}}రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లోని పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలను అక్టోబర్ ౩౦ వరకు మూసివేస్తున్నట్లు పరిపాలన ఇప్పటికే ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగుల సెలవులను కూడా అక్టోబర్ 30 వరకు రద్దు చేశారు. పరిస్థితులను బట్టి కొన్ని జిల్లాల్లో సెలవును పొడిగించే అవకాశం ఉంది.
సీఎం చంద్రబాబు సమీక్ష…
{{/usCountry}}తుఫాన్ పరిస్థితులపై సీఎం చంద్రబాబు సమీక్షిస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా క్షేత్ర స్థాయిలో పరిస్థితిని పర్యవేక్షిస్తూ.. అధికారులకు సూచనలిస్తున్నారు. ఎంత చిన్న పల్లెటూరైనా, లంక గ్రామామైనా తుఫాను సహయక చర్యలు అందేలాని అధికారులను ఆదేశించారు.రాష్ట్రంలోని తుఫాను పరిస్థితిపై సీఎం చంద్రబాబుకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఫోన్ చేశారు. తుఫాను పరిస్థితి వివరాలు అడిగి తెలుసుకున్నారు.