బంగాళాఖాతంలో ఏర్పడిన రెండు ఉపరితల ఆవర్తనాల కారణంగా ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం, రాయలసీమ ప్రాంతాలలో నవంబర్ 29 నుండి డిసెంబర్ 2 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మలక్కా జలసంధి, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంపై అల్పపీడన ప్రాంతం బలపడే సంకేతాలను చూపిస్తోందని, మంగళవారం దక్షిణ అండమాన్ సముద్రంపై వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

నవంబర్ 26 నాటికి సెన్యార్ తుపానుగా మారే మారవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మంగళవారం నాటికి కొమోరిన్, దాని పరిసర ప్రాంతాలైన నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక ప్రాంతాలలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది మరింతగా మారే అవకాశం ఉంది. కొన్ని రోజుల కిందట ఏపీ తీరప్రాంతాలను మెుంథా తుపాను ఘోరంగా ప్రభావితం చేసింది. ఇప్పుడు సెన్యార్ తుపాను ఎటువైపు దూసుకొస్తుందో అనే ఆందోళన నెలకొన్నది.
అండమాన్, నికోబార్ దీవులు, దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు, బలమైన గాలులు, సముద్రాలు అల్లకల్లోలంగా ఉంటాయని వాతావరణ నిపుణులు సూచించారు. తీరప్రాంత ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, రాబోయే కొద్ది రోజులు అధికారిక అప్డేట్స్ నిశితంగా పరిశీలించాలని కోరుతున్నారు. బంగాళాఖాతంలో రెండు ఉపరితల ఆవర్తనాలు ఒకటిగా విలీనం కావచ్చు లేదా ఒకటి బలహీనపడవచ్చు అని ఐఎండీ డైరెక్టర్ స్టెల్లా అన్నారు. సెన్యార్ తుపానుగా మారిన తర్వాత ఏపీ తీరాన్ని తాకుతుందో లేదో అని ఇప్పుడే అంచనా వేయడం కష్టమని చెప్పారు.
ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ అండమాన్ సముద్రంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది తర్వాత వాయుగుండంగా 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో తుపానుగా మారే ఛాన్స్ ఉంది.
అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వానలు పడే అవకాశం ఉంది. ఒకవేళ తుపాను ఏపీలో తీరందాటితే ఆ ప్రభావం కోస్తా జిల్లాలపై ఎక్కువగా పడనుంది. ఈదురు గాలులతో కూడిన వానలు పడతాయి. ఇప్పటికే ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షపాతం నమోదు కానుంది. అయితే ఏపీలో తుపాను తీరం దాటుతుందా లేదా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
{{/usCountry}}అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వానలు పడే అవకాశం ఉంది. ఒకవేళ తుపాను ఏపీలో తీరందాటితే ఆ ప్రభావం కోస్తా జిల్లాలపై ఎక్కువగా పడనుంది. ఈదురు గాలులతో కూడిన వానలు పడతాయి. ఇప్పటికే ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షపాతం నమోదు కానుంది. అయితే ఏపీలో తుపాను తీరం దాటుతుందా లేదా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
{{/usCountry}}