ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా గ్యాస్ కొరత లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులతో కొందరు ముందు జాగ్రత్తగా బుకింగ్ లు చేస్తున్నారని తెలిపారు. పైప్డ్ గ్యాస్ కొత్త పాలసీ తీసుకువచ్చేలా ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందన్నారు. వాణిజ్య అవసరాలకు ఇచ్చే గ్యాస్ సరఫరాను కేంద్రం పెంచిందని గుర్తుచేశారు.

రెస్టరెంట్లు, విద్యాసంస్థలకు సరఫరా పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో అమ్మకుండా ప్రత్యేక తనిఖీలు చేస్తున్నామన్నారు. బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
వాణిజ్య అవసరాలకు ఇచ్చే గ్యాస్ సరఫరాను కేంద్రం పెంచిందని నాదెండ్ల మనోహర్ అన్నారు. పట్టణ ప్రాంతాల్లో జనాలు పైప్డ్ గ్యాస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు చేయకుండా.. ప్రత్యేకంగా తనిఖీలు చేస్తున్నామన్నారు. అక్రమాలపై 800 కేసులు నమోదు చేశామని, 3540 సిలిండర్లను సీజ్ చేసినట్టుగా చెప్పారు.
'బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయి. వన్ టైమ్ పాస్వర్డ్ ద్వారా గ్యాస్ సరఫరా జరపాలి. అర్హత లేని వారి చేతుల్లోకి సిలిండర్లు వెళ్లకుండా చూసుకునే బాధ్యత మా మీదనే ఉంది. పట్టణాల్లో వినియోగదారులను ఎల్పీజీ నుంచి పీఎన్జీ వైపు మళ్లిస్తాం.' అని నాదెండ్ల మనోహర్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వాణిజ్య ఎల్పీజీ కొరత హోటళ్లు, రెస్టారెంట్లు, రోడ్డు పక్కన ఉండే తినుబండారాల కార్యకలాపాలను తీవ్రంగా దెబ్బతీసింది. దీంతో చాలా వరకు మూతపడగా, మరికొన్ని ధరలు పెంచి, మెనూను కుదించాయి. ఎల్పీజీ కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, వాణిజ్య సిలిండర్లపై ఆధారపడిన వ్యాపార యజమానులు తీవ్రమైన సరఫరా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. ఒకప్పుడు రద్దీగా ఉండే వీధుల్లో సర్వసాధారణంగా కనిపించే రోడ్డు పక్కన ఆహార విక్రయదారులు గ్యాస్ కొరత కారణంగా క్రమంగా కనిపించడం లేదు.
మరోవైపు బ్లాక్ మార్కెట్ ధరలు ఒక్కో సిలిండర్కు రూ.3,000 దాటిపోవడంతో కార్యకలాపాలు కొనసాగించడం లాభదాయకం కాదని హోటల్ యజమానులు తెలిపారు. కొన్ని తినుబండారాలు ధరలు పెంచడం లేదా పరిమాణాన్ని తగ్గించడం చేస్తున్నారు హోటల్ యజమానులు. ఉదాహరణకు గతంలో రూ.30కి లభించే నాలుగు ఇడ్లీల ప్లేటును.. ఇప్పుడు అదే ధరకు మూడు ఇడ్లీలుగా, లేదంటే నాలుగు ఇడ్లీల ధర రూ.40కి అమ్ముతున్నారు. ఇతర టిఫిన్లలో కూడా ఇలాంటి పెంపులే ఉన్నాయి.
{{/usCountry}}మరోవైపు బ్లాక్ మార్కెట్ ధరలు ఒక్కో సిలిండర్కు రూ.3,000 దాటిపోవడంతో కార్యకలాపాలు కొనసాగించడం లాభదాయకం కాదని హోటల్ యజమానులు తెలిపారు. కొన్ని తినుబండారాలు ధరలు పెంచడం లేదా పరిమాణాన్ని తగ్గించడం చేస్తున్నారు హోటల్ యజమానులు. ఉదాహరణకు గతంలో రూ.30కి లభించే నాలుగు ఇడ్లీల ప్లేటును.. ఇప్పుడు అదే ధరకు మూడు ఇడ్లీలుగా, లేదంటే నాలుగు ఇడ్లీల ధర రూ.40కి అమ్ముతున్నారు. ఇతర టిఫిన్లలో కూడా ఇలాంటి పెంపులే ఉన్నాయి.
{{/usCountry}}