తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అప్డేట్ ఇచ్చింది. వచ్చే ఫిబ్రవరి నెలలో జరిగే విశేష పర్వదినాల వివరాలను ప్రకటించింది. ఫిబ్రవరి 1న శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి ఉండగా… ఫిబ్రవరి 26న శ్రీవారి తెప్పోత్సవాలు ప్రారంభమవుతాయి.
ఫిబ్రవరి నెలలో విశేష పర్వదినాలు:
- ఫిబ్రవరి 1న శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి. మాఘ పౌర్ణమి గరుడ సేవ.
- ఫిబ్రవరి 3న తిరుమొళి శైయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
- ఫిబ్రవరి 6న కూరత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
- ఫిబ్రవరి 26న శ్రీవారి తెప్పోత్సవాలు ప్రారంభం.
- ఫిబ్రవరి 28న కుళశేఖరాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.

మరోవైపు ఏప్రిల్ నెల కోటా దర్శన టికెట్ల విడుదల తేదీలను టీటీడీ ప్రకటించింది. ఇందులో భాగంగా ఇవాళ ఎలక్ట్రానిక్ డిప్ ఈ సేవా టికెట్లు ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు జనవరి 21 నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి.
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల టికెట్లను 22న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. ఇక వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు విడుదవులవుతాయి.