మెక్సికోలోని సాల్టిల్లో వేదికగా ముగిసిన 'ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్స్ 2026'లో విజయవాడకు చెందిన ధీరజ్ బొమ్మదేవర అద్భుత ప్రదర్శనతో స్వర్ణం గెలుచుకున్నాడు. ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్స్లో పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ ఆర్చర్గా ధీరజ్ రికార్డులకెక్కాడు. ఫైనల్ పోరులో జపాన్ క్రీడాకారుడు నకానిషి జున్యాపై 6-5 తేడాతో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన షూట్-ఆఫ్ దఫాలో 10 పాయింట్ సాధించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు ధీరజ్.

మెక్సికోలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్లో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న తెలుగు విలుకాడు ధీరజ్ బొమ్మదేవరపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసల జల్లు కురిపించారు. ధీరజ్ సాధించిన చారిత్రాత్మక విజయంపై ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
'విజయవాడ ఆర్చరీ మైదానాల నుంచి ప్రారంభమైన ప్రయాణం, మెక్సికోలోని ప్రపంచ విజేతల వేదికపై అగ్రస్థానంలో నిలిచింది. అంతర్జాతీయ క్రీడారంగంలో ఒక కొత్త చరిత్ర నమోదైంది. ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్స్లో పురుషుల వ్యక్తిగత విభాగంలో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ విలుకాడిగా ధీరజ్ నిలిచాడు.' అని చంద్రబాబు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ధీరజ్ చూపించిన కఠోర శ్రమ, పట్టుదల, దృష్టి కేంద్రీకరణల వల్లే ఈ అద్భుత ఘనత సాధ్యమైందని చంద్రబాబు కొనియాడారు. రాష్ట్రంలోని వేలాదిమంది యువ క్రీడాకారులకు ధీరజ్ స్ఫూర్తిప్రదాతగా నిలిచారని, భవిష్యత్తులోనూ ఆయన మరిన్ని లక్ష్యాలను సునాయాసంగా ఛేదించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ చంద్రబాబు శుభాకాంక్షలు అందించారు.
అంకితభావం, నిరంతర సాధన, క్రమశిక్షణల సమాహారమే ధీరజ్ విజయాకారమని మంత్రి నారా లోకేష్ కొనియాడారు. ధీరజ్ సాధించిన ఈ విజయం వల్ల భారతదేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా చరిత్రకు అంతర్జాతీయ స్థాయిలో తిరుగులేని ప్రాచుర్యం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు.
మరోవైపు దుబాయ్ వేదికగా ముగిసిన ఉమెన్స్ టీ20 ఆసియా కప్ 2026 ఫైనల్లో శ్రీలంకను ఓడించి, ఏకంగా 8వ సారి ఛాంపియన్గా నిలిచిన భారత మహిళల క్రికెట్ జట్టును నారా లోకేష్ ప్రశంసించారు. ఈ చారిత్రాత్మక విజయంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన యువ స్పిన్నర్ శ్రీ చరణి కీలక పాత్ర పోషించారని లోకేష్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. శ్రీ చరణి తన 4 ఓవర్లలో కేవలం 20 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి బ్యాటింగ్ వెన్నువిరిచింది. ఈ మ్యాచ్లోని ప్రదర్శనతో శ్రీ చరణి ఒకే క్యాలెండర్ ఇయర్లో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు(39 వికెట్లు) తీసిన భారత బౌలర్గా ఘనత సాధించింది. భారత మహిళల జట్టు చూపిన టీమ్ స్పిరిట్ దేశంలోని వేలాదిమంది యువ క్రీడాకారులకు గొప్ప ప్రేరణనిస్తుందని మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు.
{{/usCountry}}మరోవైపు దుబాయ్ వేదికగా ముగిసిన ఉమెన్స్ టీ20 ఆసియా కప్ 2026 ఫైనల్లో శ్రీలంకను ఓడించి, ఏకంగా 8వ సారి ఛాంపియన్గా నిలిచిన భారత మహిళల క్రికెట్ జట్టును నారా లోకేష్ ప్రశంసించారు. ఈ చారిత్రాత్మక విజయంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన యువ స్పిన్నర్ శ్రీ చరణి కీలక పాత్ర పోషించారని లోకేష్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. శ్రీ చరణి తన 4 ఓవర్లలో కేవలం 20 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి బ్యాటింగ్ వెన్నువిరిచింది. ఈ మ్యాచ్లోని ప్రదర్శనతో శ్రీ చరణి ఒకే క్యాలెండర్ ఇయర్లో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు(39 వికెట్లు) తీసిన భారత బౌలర్గా ఘనత సాధించింది. భారత మహిళల జట్టు చూపిన టీమ్ స్పిరిట్ దేశంలోని వేలాదిమంది యువ క్రీడాకారులకు గొప్ప ప్రేరణనిస్తుందని మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు.
{{/usCountry}}