...
...
Next Story

APSRTC Free Bus : ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగులకు ఫ్రీ బస్సు.. ప్రారంభించిన సీఎం చంద్రబాబు

APSRTC Free Bus : ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించారు.

Published on: Mar 18, 2026, 14:35:48 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లతో కలిసి దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులకు సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులతో సహా అన్ని ఏపీఎస్ఆర్టీసీ సర్వీసులలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించి, వారికి అందుబాటులో ఉండే రవాణాను అందిస్తున్నారు.

దివ్యాంగ శక్తి ప్రారంభం
దివ్యాంగ శక్తి ప్రారంభం

ప్రారంభోత్సవం అనంతరం, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మరియు నారా లోకేష్ మంగళగిరి బస్ స్టేషన్ నుండి పెనుమాక వరకు దివ్యాంగులైన ప్రయాణికులతో కలిసి పల్లెవెలుగులో ప్రయాణించారు. ఈ పథకం కింద 21 విభిన్న వర్గాలకు చెందిన 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వ్యక్తులు, అవసరమైతే సహాయకులతో పాటు ప్రయాణించవచ్చు.

ఈ కార్యక్రమం ద్వారా సుమారు 12.76 లక్షల మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందుతారని అంచనా. ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి, నిర్వహించడానికి ప్రభుత్వం ఏటా రూ.207 కోట్లు కేటాయించింది.

కూటమి ప్రభుత్వం వచ్చాక దివ్యాంగులకు అందుతున్న సంక్షేమ పథకాలు, వారి బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్. పథకం ప్రారంభం సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు, కూటమి పార్టీల కార్యకర్తలు, లబ్ధిదారులు తరలివచ్చారు.

దివ్యాంగులతో కలిసి ప్రయాణం చేసిన అనంతరం క్యాంపు కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ చేరుకున్నారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో దివ్యాంగ శక్తి పథకం లబ్ధిదారులుతో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. క్యాంప్ కార్యాలయానికి వచ్చిన దివ్యాంగులను అందరినీ ఆప్యాయంగా పలకరించారు. అనంతరం దివ్యాంగులతో కలిసి భోజనం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించటంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు దివ్యాంగులు. తమకు ఈ పథకం ఎంతో ఉపయోగరంగా ఉంటుందని చెప్పారు. సహాయకులకు ప్రయాణంలో 50 శాతం రాయితీ కల్పించటంపై హర్షం వ్యక్తం చేశారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe