తూర్పు గోదావరి జిల్లా బొబ్బిల్లంకలో జంట హత్యలు వెలుగు చూశాయి. భార్యను హత్య చేసి భర్త… ఆపై అత్తను కూడా నరికి చంపాడు. కుటుంబ గొడవలే హత్యకు కారణమని తెలిసింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో దారుణం వెలుగు చూసింది. భార్యను హత్య చేసిన భర్త… ఆపై అత్తను కూడా కత్తితో నరికి చంపాడు. సీతానగరం మండలం బొబ్బిలంకలో ఈ ఘటన చోటుచేసుకుంది.
జంట హత్యలు (representative image) (image istock)
ప్రాథమిక వివరాల ప్రకారం.. సీతారామరాజు, లత ప్రేమ వివాహం చేసుకున్నారు. గత కొంతకాలంగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో లత… తల్లి లక్ష్మి ఇంటి వద్ద ఉంటోంది. సోమవారం అర్ధరాత్రి అక్కడికి వెళ్లి భర్త సీతారామరాజు… వారిద్దరన్నీ దారుణంగా నరికి చంపాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.నిందితుడుతు గతంలోనూ ఓ హత్య కేసులో జైలుకెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది. భార్యపై అనుమానంతోనే ఈ హత్య చేసినట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ జంట హత్యల ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.