ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తీవ్రరూపం దాల్చాయి. జులై 22, 23 తేదీల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసినప్పటికీ, తీవ్రమైన వర్షపాత లోటుపై అవి ఎలాంటి సానుకూల ప్రభావాన్ని చూపలేకపోయాయి. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ గణాంకాల ప్రకారం జులై 23 నాటికి రాష్ట్రంలో మొత్తం వర్షపాత లోటు ఏకంగా 53.3 శాతానికి చేరుకుంది.

రాష్ట్రంలోని మొత్తం 28 జిల్లాల్లో ఒక్క ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మినహా, 27 జిల్లాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. అనేక జిల్లాల్లో పరిస్థితి చాలా ఆందోళనకరంగా మారింది. తీవ్ర లోటు ఉన్న జిల్లాలు విశాఖపట్నం, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో వర్షపాత లోటు 60 శాతం నుండి 76 శాతం వరకు ఉంది. వీటిని తీవ్ర లోటు విభాగాలుగా వర్గీకరించారు.
పశ్చిమ గోదావరి జిల్లా అత్యంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇక్కడ ఏకంగా 76.8 శాతం వర్షపాత లోటు నమోదైంది.
జూన్ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 223 మిమీ నమోదు కావాల్సి ఉండగా, రాష్ట్రంలో కేవలం 104.1 మిమీ మాత్రమే కురిసింది. జూన్ నెలలో సాధారణ వర్షపాతం నమోదైనప్పటికీ, జులై మొదటి మూడు వారాల్లో తీవ్ర ఎండలు, పొడి వాతావరణం నెలకొంది. జులైలో సాధారణంగా కురవాల్సిన 125.7 మిమీ వర్షపాతానికి గాను కేవలం 31.4 మిమీ మాత్రమే నమోదైంది.
రాష్ట్రంలోని మొత్తం 688 మండలాల్లో కేవలం 2 మండలాలు మాత్రమే (రెండూ నెల్లూరు జిల్లాలోనే) అత్యధిక వర్షపాతం పొందాయి. 13 మండలాల్లో అధిక వర్షపాతం, 74 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. మిగిలిన వాటిలో 359 మండలాలు వర్షపాత లోటుతోను, 240 మండలాలు తీవ్ర వర్షపాత లోటుతోను అల్లాడుతున్నాయి.
{{/usCountry}}రాష్ట్రంలోని మొత్తం 688 మండలాల్లో కేవలం 2 మండలాలు మాత్రమే (రెండూ నెల్లూరు జిల్లాలోనే) అత్యధిక వర్షపాతం పొందాయి. 13 మండలాల్లో అధిక వర్షపాతం, 74 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. మిగిలిన వాటిలో 359 మండలాలు వర్షపాత లోటుతోను, 240 మండలాలు తీవ్ర వర్షపాత లోటుతోను అల్లాడుతున్నాయి.
{{/usCountry}}అమరావతి వాతావరణ కేంద్రం నివేదిక ప్రకారం జులై 30 వరకు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీలోని అనేక ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుంది. జులై 24, 25 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొంది. కాకినాడ జిల్లాలోని వాకలపూడిలో అత్యధికంగా 14.62 మిమీ వర్షపాతం నమోదు కాగా, ఎన్టీఆర్, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో స్వల్పంగా జల్లులు కురిశాయి.