దేశీయ వంటగ్యాస్ వినియోగదారులు తమ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్పీజీ) కనెక్షన్ల ఇ-కేవైసీని పూర్తి చేయడానికి గడువును మళ్లీ సెప్టెంబర్ 14 వరకు పొడిగించారు. ఒక వారం పొడిగింపును ధృవీకరిస్తూ.. మూడు చమురు మార్కెటింగ్ కంపెనీలలో (OMC) ఒక సీనియర్ అధికారి ఈ విషయాన్ని తెలిపారు. తెలంగాణలోని 1.26 కోట్ల ఎల్పీజీ వినియోగదారులలో 88 శాతం మంది ఈ ప్రక్రియను పూర్తి చేశారు.

మిగిలిన వినియోగదారులు కూడా e-KYCని వెంటనే పూర్తి చేయాలి. పూర్తి చేయడంలో విఫలమైతే సిలిండర్లు ఏ ధరకు సరఫరా అవుతాయో అనే విషయం మాత్రం అస్పష్టంగానే ఉంది. ఎందుకంటే ప్రభుత్వం దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మళ్లీ మళ్లీ గడువు పొడిగింపులు వినియోగదారులు e-KYC పూర్తి చేయాలనే ఉద్దేశాన్ని స్పష్టం చేస్తున్నాయి.
అయితే సబ్సిడీ సిలిండర్లు అర్హులైన వారికి మాత్రమే అందేలా చూసేందుకు చేపట్టిన ఈ-కేవైసీ ప్రక్రియ 100 శాతం పూర్తయ్యే అవకాశం లేదని చమురు రంగానికి చెందిన నిపుణులు భావిస్తున్నారు. ఇంకా ఈ-కేవైసీ పూర్తి చేయని వారిలో చాలామంది ఒకే పేరు మీద బహుళ కనెక్షన్లు కలిగి ఉండటం లేదా ఇతరుల పేర్లపై ఉన్న కనెక్షన్లను ఉపయోగిస్తుండటమే దీనికి కారణమని అభిప్రాయపడుతున్నారు.
మిగిలిన వినియోగదారులు ఈ కేవైసీ కోసం ముందుకు వచ్చే వేగం నెమ్మదిగా ఉందని అధికారులు చెబుతున్నారు. వారం క్రితం రాష్ట్రంలో 86 శాతంగా ఈ కేవైసీ కోసం వచ్చారు. ఆగస్ట్ 23 నుండి ఆగస్టు 31 వరకు, ఆపై సెప్టెంబర్ 7 వరకు ఇటీవలి వారాల్లో గడువు చాలాసార్లు పొడిగించారు.
మరోవైపు ఈ-కేవైసీ ప్రక్రియతో సంబంధం లేని విషయాన్ని కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ మేరకు చమురు సంస్థలకు కీలక సూచన చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులు రెండో సిలిండర్ బుకింగ్ చేసుకోవడానికి ఉన్న 45 రోజుల నిరీక్షణ సమయాన్ని 25 రోజులకు తగ్గించాలని ఆదేశించింది. దీనితో పట్టణ ప్రాంతాల్లో అమలులో ఉన్న నిబంధనలే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకూ వర్తించనున్నాయి.
{{/usCountry}}మరోవైపు ఈ-కేవైసీ ప్రక్రియతో సంబంధం లేని విషయాన్ని కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ మేరకు చమురు సంస్థలకు కీలక సూచన చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులు రెండో సిలిండర్ బుకింగ్ చేసుకోవడానికి ఉన్న 45 రోజుల నిరీక్షణ సమయాన్ని 25 రోజులకు తగ్గించాలని ఆదేశించింది. దీనితో పట్టణ ప్రాంతాల్లో అమలులో ఉన్న నిబంధనలే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకూ వర్తించనున్నాయి.
{{/usCountry}}పశ్చిమాసియా సంక్షోభం తీవ్రంగా ఉన్న సమయంలో గ్యాస్ డిమాండ్ను నియంత్రించేందుకు రెండు బుకింగ్ల మధ్య ఈ కనీస వ్యవధి నిబంధనను తీసుకువచ్చారు. అయితే ప్రస్తుతం ఎల్పీజీ సరఫరా మెరుగ్గా ఉండటం, గతంతో పోలిస్తే పెండింగ్ ఆర్డర్లు గణనీయంగా తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చమురు సంస్థలకు పంపిన లేఖలో పేర్కొన్నారు.