SCR Train Cancellations : ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ముఖ్యమైన అలర్ట్ ఇచ్చింది. నిర్వహణాపరమైన లోపాల (ఆపరేషనల్ కన్స్ట్రైంట్స్) కారణంగా హైదరాబాద్ - మంగళూరు, సికింద్రాబాద్ - శ్రీకాకుళం రోడ్ మధ్య నడిచే పలు వారంతపు ప్రత్యేక రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. గతంలో పొడిగించిన ఈ సర్వీసులను ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ రైళ్లు రద్దు….

రైల్వే శాఖ ప్రకటనలోని వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి మంగళూరు వెళ్లే ప్రత్యేక రైలు (నంబర్ 07097) జూలై నెలలో ప్రతి బుధవారం రద్దయింది. అంటే జూలై 8, 15, 22, 29 తేదీల్లో ఈ రైలు నడవదు. దీనివల్ల మొత్తం 4 ట్రిప్పులు రద్దయ్యాయి. ఇక తిరుగు ప్రయాణంలో మంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చే రైలు (నంబర్ 07098) జూలై 9, 16, 23, 30 తేదీల్లో (ప్రతి గురువారం) ప్రయాణికులకు అందుబాటులో ఉండదు.
మరోవైపు సికింద్రాబాద్ - శ్రీకాకుళం రోడ్ మధ్య నడిచే వీక్లీ స్పెషల్ రైలును కూడా అధికారులు పాక్షికంగా రద్దు చేశారు. సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం రోడ్ వెళ్లే రైలు (నంబర్ 07425) జూలై 19, 26 తేదీల్లో (ఆదివారాలు) నడవదు. అలాగే శ్రీకాకుళం రోడ్ నుంచి సికింద్రాబాద్ వచ్చే తిరుగు ప్రయాణ రైలు (నంబర్ 07426) జూలై 20, 27 తేదీల్లో (సోమవారాలు) రద్దయింది. ఈ రూట్లలో ప్రయాణించే వారు తమ ప్రయాణాలను తదనుగుణంగా మార్చుకోవాలని అధికారులు సూచించారు.
ఆగస్టు నుంచి యథావిధిగా పునరుద్ధరణ
శ్రీకాకుళం మార్గంలో ప్రయాణించే వారికి రైల్వే శాఖ మరో అప్డేట్ కూడా ఇచ్చింది. జూలై నెలలో కొన్ని వారాల పాటు ఈ ట్రిప్పులను రద్దు చేసినప్పటికీ, ఆగస్టు మొదటి వారం నుంచి ఈ ప్రత్యేక రైలు సర్వీసులు మళ్లీ పట్టాలెక్కుతాయని స్పష్టం చేసింది.
{{/usCountry}}శ్రీకాకుళం మార్గంలో ప్రయాణించే వారికి రైల్వే శాఖ మరో అప్డేట్ కూడా ఇచ్చింది. జూలై నెలలో కొన్ని వారాల పాటు ఈ ట్రిప్పులను రద్దు చేసినప్పటికీ, ఆగస్టు మొదటి వారం నుంచి ఈ ప్రత్యేక రైలు సర్వీసులు మళ్లీ పట్టాలెక్కుతాయని స్పష్టం చేసింది.
{{/usCountry}}సికింద్రాబాద్ - శ్రీకాకుళం రోడ్ ఎక్స్ప్రెస్ (07425) సర్వీసులు ఆగస్టు 2వ తేదీ నుంచి సెప్టెంబర్ 27 వరకు ప్రతి ఆదివారం యథావిధిగా కొనసాగుతాయి. అదేవిధంగా శ్రీకాకుళం రోడ్ - సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ (07426) తిరుగు ప్రయాణ సర్వీసులు ఆగస్టు 3వ తేదీ నుంచి సెప్టెంబర్ 28 వరకు ప్రతి సోమవారం ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.