మెుంథా తీవ్ర తుపానుగా మారి ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ప్రభావం చూపిస్తుంది. తీరం వైపు దూసుకొస్తున్న కొద్ది పరిస్థితులు మారుతున్నాయి. ఈదురుగాలులు, వర్షాలు పడుతున్నాయి. అక్టోబర్ 29వ తేదీ ఉదయం వరకు ఏపీలోని గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి,నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాలకు ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉంది.

అలాగే తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలు, ఒడిశాలోని గజపతి, గంజాం జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.
పశ్చిమమధ్య బంగాళాఖాతంలో మొంథా తీవ్ర తుపాన్.. గడిచిన గంటలో 10 కి.మీ వేగంతో కదిలిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దగ్గరకు వచ్చే కొద్ది తీవ్ర ప్రభావం చూపుతుంది. కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరందాటే సమయంలో గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీయనున్నాయి. కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
తుపాను తీరం దాటే సమయంలో గంటన్నరపాటు ప్రభావం అతిగా ఉంటుందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. మరికొన్ని చోట్ల కొండ చరియాలు విరిగి పడతాయని, రాత్రికి మొంథా తుపాను తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. తుపాను ప్రభావంతో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే రాయలసీమ జిల్లాల్లోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి.
ఇక గోదావరి జిల్లాల్లో గాలులు తీవ్రంగా ఉన్నాయి. కాకినాడ, యానాం తీరాలు ఉప్పెన ముప్పు ఉందని అంటున్నారు. అంతర్వేదిలో ఈదురుగాలులు విపరీతంగా వీస్తున్నాయి. పలు ప్రాంతాల్లో చెట్లు నెలకూలాయి. రోడ్లు కూడా ధ్వంసం అయ్యాయి. ఇక తీర ప్రాంతాల్లో అలలు ఎగిసిపడుతున్నాయి. కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీరం కోతకు గురైంది. నెల్లూరు మైపాడులో 10 మీటర్ల వరకు అలలు ఎగిసిపడుతున్నాయి.
{{/usCountry}}ఇక గోదావరి జిల్లాల్లో గాలులు తీవ్రంగా ఉన్నాయి. కాకినాడ, యానాం తీరాలు ఉప్పెన ముప్పు ఉందని అంటున్నారు. అంతర్వేదిలో ఈదురుగాలులు విపరీతంగా వీస్తున్నాయి. పలు ప్రాంతాల్లో చెట్లు నెలకూలాయి. రోడ్లు కూడా ధ్వంసం అయ్యాయి. ఇక తీర ప్రాంతాల్లో అలలు ఎగిసిపడుతున్నాయి. కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీరం కోతకు గురైంది. నెల్లూరు మైపాడులో 10 మీటర్ల వరకు అలలు ఎగిసిపడుతున్నాయి.
{{/usCountry}}కాకినాడ ఓడరేవు వద్ద 10వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. కాకినాడ ఓడరేవులో ప్రమాద సిగ్నల్ ఏడు నుంచి 10కి పెంచారు. తీవ్రమైన తుపానుల సమయాల్లో పోర్టుకు జారీ చేసి అతి పెద్ద ప్రమాద సంకేతం ఇది. విశాఖపట్నం, గంగవరం, కళింగపట్నం, భీమునిపట్నం ఓడరేవుల్లో గ్రేట్ డేంజర్ సిగ్నల్ నంబర్ 9 ఇచ్చారు. మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, వాడరేవు ఓడరేవుల్లో ఎనిమిదో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
ఈ తీవ్ర తుపాను ఈ రాత్రి కాకినాడ సమీపంలో మచిలీపట్నం, కళింగపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 90-110 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయి. జాతీయ రహదారులపై వాహనాలను పక్కకు నిలుపుకోవాలని అధికారులు హెచ్చరించారు. అనవసరంగా బయటకు రావొద్దని హెచ్చరించారు.