గోదావరి డెల్టా పరిధిలోని రైతాంగానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఖరీఫ్ సాగు పనులను ముందస్తుగానే ప్రారంభించేందుకు వీలుగా.. ధవళేశ్వరంలోని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ నుండి గోదావరి నీటిని విడుదల చేశారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గోదావరి డెల్టా ప్రజాప్రతినిధులతో కలిసి గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు.

ఈ ముందస్తు నీటి విడుదల, ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ పూర్తి వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. మొదటి విడతలో భాగంగా విడుదల చేసిన ఈ నీరు గోదావరి డెల్టా పరిధిలోని 2.63 లక్షల ఎకరాల వ్యవసాయ భూములకు అందనుంది.
- తూర్పు డెల్టా: 85,000 ఎకరాలు
- నిడదవోలు, కొవ్వూరు కాలువలు: 41,000 ఎకరాలు
- కాకినాడ జిల్లా పరిధి: 1.37 లక్షల ఎకరాలు
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రైతు సదస్సులో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. ముందస్తు ఖరీఫ్ పనులను సజావుగా సాగించేందుకు రైతులు నీటిని పొదుపుగా, సమర్థవంతంగా నిర్వహించుకోవాలని కోరారు. డెల్టాలోని సాగునీటి కాలువల మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ. 13 కోట్లు ఖర్చు చేస్తోందని, ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు. రెండో విడతలో మిగిలిన కాలువలకు కూడా ఖరీఫ్ సాగు కోసం నీటిని విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
కాటన్ బ్యారేజ్ పునర్నిర్మాణ పనులకు హామీ
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు సానా సతీష్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, అమలాపురం ఎంపీ జి. హరీష్ మధుర్ రైతాంగానికి కీలక హామీ ఇచ్చారు. దశాబ్దాల చరిత్ర కలిగిన సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ ఆధునీకరణ, పునర్నిర్మాణ పనులను రాబోయే కొద్ది నెలల్లోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ప్రారంభిస్తామని వారు ప్రకటించారు.
సాధారణంగా జూన్ రెండో వారంలో విడుదల కావాల్సిన గోదావరి నీటిని, ఈసారి మే నెలాఖరులోనే(మే 31) విడుదల చేయడం వల్ల అక్టోబర్ నాటికే పంట చేతికి వస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నీటి విడుదల కంటే ముందే గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ మూరాలశెట్టి సునీల్ కుమార్, వెస్టర్న్ డెల్టా చైర్మన్ మురళీకృష్ణా రాజు, ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ జి. శ్రీనివాసరావు తదితర అధికారులు నీటి లభ్యతపై సమగ్ర సమీక్ష జరిపి ఈ యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేశారు.
{{/usCountry}}సాధారణంగా జూన్ రెండో వారంలో విడుదల కావాల్సిన గోదావరి నీటిని, ఈసారి మే నెలాఖరులోనే(మే 31) విడుదల చేయడం వల్ల అక్టోబర్ నాటికే పంట చేతికి వస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నీటి విడుదల కంటే ముందే గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ మూరాలశెట్టి సునీల్ కుమార్, వెస్టర్న్ డెల్టా చైర్మన్ మురళీకృష్ణా రాజు, ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ జి. శ్రీనివాసరావు తదితర అధికారులు నీటి లభ్యతపై సమగ్ర సమీక్ష జరిపి ఈ యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేశారు.
{{/usCountry}}