ఆంధ్రప్రదేశ్లో న్యాయవాదుల భద్రత, రక్షణ, వారి సంక్షేమాన్ని పటిష్టం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్లు - 2026 ముసాయిదా తయారీ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. ఈ చట్టానికి సంబంధించిన ముసాయిదాను వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని మంత్రి ఎన్. మహమ్మద్ ఫరూక్ అధికారులను ఆదేశించారు.

ఈ మేరకు ఓ ప్రకటనలో మంత్రి ఫరూక్ వివరాలను వెల్లడించారు. న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభా దేవికి సంబంధిత శాఖలతో చర్చలు జరిపి, ఈ బిల్లు ముసాయిదాను ప్రాధాన్యతా ప్రాతిపదికన సిద్ధం చేయాలని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న న్యాయవాదుల హక్కులను కాపాడటానికి, వారి రక్షణ, సంక్షేమాన్ని నిర్ధారించడానికి కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న అడ్వకేట్లకు తగిన భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
ముసాయిదా బిల్లు రూపకల్పన పూర్తయిన తర్వాత పాటించే విధివిధానాలను మంత్రి వివరించారు. సిద్ధమైన ముసాయిదాను ముందుగా అడ్వకేట్ జనరల్, ఆర్థిక శాఖల పరిశీలనకు పంపుతారు. వారి సలహాలు, సిఫార్సుల అనంతరం తుది ముసాయిదాను రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం కోసం సమర్పిస్తారు. కేబినెట్ ఆమోదం లభించిన వెంటనే ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఎటువంటి ఆలస్యం లేకుండా శాసన ప్రక్రియను పూర్తి చేసేందుకు వీలుగా ముసాయిదాను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
న్యాయవాదుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న అంకితభావాన్ని ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ గుర్తుచేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకంలో భాగంగా ఇప్పటివరకు మరణించిన 1,173 మంది న్యాయవాదుల కుటుంబాలకు రూ. 46.92 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించినట్లు తెలిపారు. ప్రతి బాధిత కుటుంబానికి రూ. 4 లక్షల చొప్పున ఆర్థిక ఉపశమనం కల్పించామని ఆయన చెప్పారు. ప్రతిపాదిత అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా న్యాయవాదులకు సంస్థాగత రక్షణ లభించడమే కాకుండా, వారి భద్రత, సంక్షేమానికి సంబంధించిన చర్యలు మరింత బలోపేతం అవుతాయని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.
{{/usCountry}}న్యాయవాదుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న అంకితభావాన్ని ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ గుర్తుచేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకంలో భాగంగా ఇప్పటివరకు మరణించిన 1,173 మంది న్యాయవాదుల కుటుంబాలకు రూ. 46.92 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించినట్లు తెలిపారు. ప్రతి బాధిత కుటుంబానికి రూ. 4 లక్షల చొప్పున ఆర్థిక ఉపశమనం కల్పించామని ఆయన చెప్పారు. ప్రతిపాదిత అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా న్యాయవాదులకు సంస్థాగత రక్షణ లభించడమే కాకుండా, వారి భద్రత, సంక్షేమానికి సంబంధించిన చర్యలు మరింత బలోపేతం అవుతాయని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.
{{/usCountry}}