జీవీఎంసీ సూపర్ ఐడియా.. విశాఖలో ప్రతీ సోమవారం సైక్లింగ్ డే.. ఫిట్నెస్కు వెల్కమ్, పొల్యూషన్కు బై బై
GVMC : గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వినూత్న కార్యాక్రమం చేపట్టింది. కార్పొరేషన్ పరిధిలో ప్రతీ సోమవారం అందరూ సైకిళ్లను ఉపయోగించాలని విజ్ఞప్తి చేస్తోంది.
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ప్రతి సోమవారాన్ని 'సైక్లింగ్ డే'గా పాటిస్తూ, తమ అధికారులు, ఉద్యోగులు సైకిళ్లపై ప్రయాణించేలా ప్రోత్సహిస్తోంది. పౌరులు కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరుతోంది. సుస్థిర పట్టణ జీవనాన్ని ప్రోత్సహించడం, కాలుష్యాన్ని తగ్గించడం, ఇంధనాన్ని ఆదా చేయడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం కోసం కార్పొరేషన్ చేస్తున్న ప్రయత్నాలలో ఈ కార్యక్రమం ఒక భాగమని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ కార్యక్రమానికి మద్దతుగా జీవీఎంసీ నగరం అంతటా ప్రత్యేక సైక్లింగ్ ట్రాక్లను అభివృద్ధి చేస్తోంది. వీటిలో సాగర్ నగర్ సమీపంలో రూ. 2 కోట్ల వ్యయంతో 700 మీటర్ల బీచ్ఫ్రంట్ ట్రాక్, అరిలోవా నైపుణ్యాభివృద్ధి కేంద్రం సమీపంలో రూ. 3 కోట్ల వ్యయంతో 5.2 కిలోమీటర్ల ట్రాక్ ఉన్నాయి. పచ్చదనం, ఆరోగ్యకరమైన జీవనం, పర్యావరణ అనుకూల రవాణా, వారసత్వ సంపద పరిరక్షణపై దృష్టి సారించి విశాఖపట్నాన్ని ఒక ఆదర్శ నగరంగా మార్చేందుకు జీవీఎంసీ కృషి చేస్తోందని కమిషనర్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, ప్రజా భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ శారీరక, మానసిక శ్రేయస్సును మెరుగుపరచడమే ఈ చర్యల లక్ష్యమని ఆయన అన్నారు.
విస్తృత కార్యక్రమంలో భాగంగా జీవీఎంసీ నగరవ్యాప్తంగా రూ. 10.97 కోట్ల అంచనా వ్యయంతో 60 థీమ్ పార్కులను అభివృద్ధి చేస్తోంది. ఈ పార్కులు ప్రకృతి, సాహసం, ఫిట్నెస్, పిల్లల కార్యకలాపాలు వంటి థీమ్లపై ఆధారపడి ఉంటాయి. వీటిలో సుందరమైన తోటలు, జాగింగ్ ట్రాక్లు, యోగా జోన్లు, ఆట పరికరాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, వర్షపు నీటి సేకరణ వ్యవస్థలు, సౌర దీపాలు వంటి సౌకర్యాలు ఉంటాయి.
కార్పొరేషన్ దక్షిణ జోన్లో పూర్ణ మార్కెట్ నుండి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు 1.2 కిలోమీటర్ల హెరిటేజ్ వాకింగ్ ట్రాక్ను కూడా పూర్తి చేసింది. రూ. 42 లక్షల వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ ట్రాక్లో, ఆ ప్రాంతం చారిత్రక ప్రాముఖ్యతను తెలియజేసే సైన్బోర్డులు, దిశా సూచికలు, సమాచార ప్రదర్శనలు ఉన్నాయి. పచ్చదనం, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, వారసత్వ సంరక్షణ అనేవి సుస్థిర పట్టణాభివృద్ధిలో పరస్పరం అనుసంధానించిన అంశాలని కేతన్ గార్గ్ అన్నారు. ఈ కార్యక్రమాలకు మద్దతునిచ్చి.. 'హరిత వైజాగ్ – ఆరోగ్యకరమైన వైజాగ్' నిర్మాణానికి సహాయపడాలని కమిషనర్ పౌరులకు విజ్ఞప్తి చేశారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


