...
...
Next Story

పదో తరగతితో శ్రీకాకుళం జిల్లాలో ఉద్యోగాలు.. జులై 9 లాస్ట్ డేట్.. ఇక్కడ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి

Srikakulam Jobs 2026 : ఏపీ ప్రభుత్వ సెకండరీ హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో పలు పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. అర్హత గల అభ్యర్తులు జులై 9వ తేదీలోపు అప్లికేషన్ అందించాలి.

Published on: Jul 6, 2026, 22:21:00 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెకండరీ హెల్త్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో జాబ్ నోటిఫికేషన్ ప్రకటించింది. నిరుద్యోగులకు మంచి సరికొత్త ఉపాధి అవకాశాన్ని కల్పిస్తోంది. శ్రీకాకుళం జిల్లా పరిధిలోని జిల్లా కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్(DCHS) కార్యాలయం, వివిధ జిల్లా సెకండరీ హెల్త్ ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న సిబ్బంది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పూర్తిగా ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఈ నియామకాలు జరగనున్నాయి. అర్హత, ఆసక్తి గల స్థానిక అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

శ్రీకాకుళం జిల్లాలో ఉద్యోగాలు
శ్రీకాకుళం జిల్లాలో ఉద్యోగాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో మొత్తం 20 పోస్టులను భర్తీ చేయనున్నారు. వాటి వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:

పోస్టుల వివరాలు

జనరల్ డ్యూటీ అటెండెంట్ : 15 పోస్టులు

పోస్ట్‌మార్టం అసిస్టెంట్: 03 పోస్టులు

థియేటర్ అసిస్టెంట్: 01 పోస్టు

ప్లంబర్ : 01 పోస్టు

కావాల్సిన విద్యా అర్హతలు

వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి విద్యార్హతలు కలిగి ఉండాలి. జనరల్ డ్యూటీ అటెండెంట్, పోస్ట్‌మార్టం అసిస్టెంట్, థియేటర్ అసిస్టెంట్.. ఈ మూడు రకాల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కేవలం పదో తరగతి లేదా దానికి సమానమైన కోర్సులో ఉత్తీర్ణులై ఉంటే సరిపోతుంది.

ప్లంబర్‌కు పదో తరగతి పాస్ అవ్వడంతో పాటు గుర్తింపు పొందిన ఏవైనా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్(ITI) నుండి ప్లంబింగ్ లేదా ఫిట్టర్ లేదా మెకానిక్ ట్రేడులలో ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

వయోపరిమితి, జీతభత్యాలు

అభ్యర్థుల వయస్సు 01 జనవరి 2025 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో చట్టబద్ధమైన సడలింపులు వర్తిస్తాయి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు గౌరవ వేతనంగా థియేటర్ అసిస్టెంట్, పోస్ట్‌మార్టం అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్లకు రూ. 15,000 ఇస్తారు. అలాగే ప్లంబర్ పోస్టుకు ఎంపికైన వారికి నెలకు రూ. 18,500 జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక ప్రక్రియ

అభ్యర్థులు అధికారిక అప్లికేషన్ ఫారమ్‌ను శ్రీకాకుళం జిల్లా అధికారిక వెబ్‌సైట్ (https://srikakulam.ap.gov.in) నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి. పూరించిన దరఖాస్తు ఫారమ్‌కు మీ విద్యార్హతలు, కుల ధృవీకరణ, నివాస ధృవీకరణ పత్రాల జిరాక్స్ కాపీలను జతచేసి, నేరుగా కింది చిరునామాలో అందజేయాలి.

దరఖాస్తులు సమర్పించాల్సిన చిరునామా: జిల్లా కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ (DCHS) కార్యాలయం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్. దరఖాస్తుకు చివరి తేదీ 2026 జులై 09 (ఆఫీస్ పనివేళల్లోగా సమర్పించాలి).

ఈ లింక్ క్లిక్ చేసి నోటిఫికేషన్ చదవండి.

ఈ లింక్ క్లిక్ చేసి అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe