AP Telangana Weather Updates : నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాల తీవ్రత పెరగనుంది. రానున్న రెండు రోజుల పాటు రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వానలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.
తెలంగాణలోని ఈ జిల్లాలకు హెచ్చరికలు…

హైదరాబాద్ వాతావరణ రిపోర్ట్ ప్రకారం…. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు, జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
ఇవాళ ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, జనగామ, మహబూబాబాద్, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ప్రాంతాలకు 'ఎల్లో అలర్ట్' జారీ చేశారు. వర్షం కురిసే సమయంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే సూచనలున్నాయి
జూలై 6వ తేదీ ఉదయం నుండి జూలై 7వ తేదీ ఉదయం వరకు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. బలమైన ఉపరితల గాలులు వీచే సూచనలున్నాయి. జూలై 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు కూడా రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు.
ఏపీలోనూ వర్షాలు…
మరోవైపు ఆంధ్రప్రదేశ్ నూ వర్షాలు పడనున్నాయి. ఆదివారం (ఇవాళ) రాష్ట్రవ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణం ఉంటుందని, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది.
{{/usCountry}}మరోవైపు ఆంధ్రప్రదేశ్ నూ వర్షాలు పడనున్నాయి. ఆదివారం (ఇవాళ) రాష్ట్రవ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణం ఉంటుందని, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది.
{{/usCountry}}ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ జల్లులు కురుస్తాయని అంచనా వేసింది. ఏపీ తీరప్రాంతాలు, మైదాన ప్రాంతాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే సూచనలున్నాయి.
వర్షాలు, ఈదురుగాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. "ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద, బలహీనమైన భవనాల కింద, భారీ హోర్డింగ్స్ మరియు విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకూడదు," అని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.