ఏపీ ప్రజలకు అలర్ట్.. జలవనరుల శాఖ నుంచి కీలక ప్రకటన!

ఆంధ్రప్రదేశ్‌లో మెుంథా తుపాను ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ జలవనరుల శాఖ కీలక అలర్ట్ ఇచ్చింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.

Published on: Oct 30, 2025, 12:03:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మెుంథా తుపాను ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఏపీ తీరందాటినా దాని ప్రభావం ఇంకా తగ్గడం లేదు. దీంతో ఏపీ జలవనరుల అభివృద్ధి శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. కృష్ణా ఉపనదులకు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. కృష్ణా నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలవనరుల అభివృద్ధి శాఖ ప్రకటన జారీ చేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

తుపాను ప్రభావంతో కృష్ణా, గోదావరి నదులకు భారీగా వరద నీరు వస్తోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు, ప్రకాశం బ్యారేజీకి భారీగా ఇన్‌ఫ్లో వస్తోంది. వరదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ జలవనరుల అభివృద్ధి శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ప్రాజెక్టులు, నదులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వాగులు, వంకలు పొంగిపొర్లతున్నాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

గుంటూరు జిల్లాలో భారీ వర్షాలతో నల్లమడ వాగుకు వరద ఉద్ధృతి పెరిగింది. కట్ట మీద నుంచి నీరు పై నుంచి పారుతోంది. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు దగ్గర మున్నేరుకు వరద నీరు భారీగా వస్తోంది. దీంతో వరద కాజ్ వే పైకి వచ్చే అవకాశం ఉంది. శ్రీశైలం-హైదరాబాద్ హైవే ప్రభావితమై రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ వాగులు, వంకల గుండా భారీగా వరద ప్రవాహం వెళ్తుంది. నదులకు వరద వస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

విశాఖపట్నం, శ్రీకాకుళం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, బాపట్ల, కృష్ణా, మచిలీపట్నం జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇంకా ఈ ప్రాంతాల్లో మరో 24 గంటల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలకు అవకాశం ఉంది. అత్యవసరం అయితేనే బయటకు రావాలని అధికారులు చెబుతున్నారు. ఇతర జిల్లాల్లోనూ వర్షాలు జోరుగానే ఉన్నాయి.

చాలా ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా భారీగా పంట నష్టం జరిగింది. దీనిపై అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలు అండగా ఉంటామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. మరోవైపు సహాయక శిబిరాల్లో బాధితులు నడుస్తూనే ఉన్నాయి. కావాల్సిన సౌకర్యాలను అధికారులు చూసుకుంటున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More