పోలవరం జిల్లా దేవీపట్నం మండలం పాత నేలకోట గ్రామ పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తూ కనిపించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అంతేకాదు ఈ ప్రాంతంలో థర్మల్ డ్రోన్ కెమెరాకు పులి చిక్కింది. ఈ క్రమంలోనే అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై, పులిని సురక్షితంగా బంధించడానికి ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం పూడిపల్లి-నేలకోట మధ్యన కొండ ప్రాంతంలో ఉన్నట్టుగా గుర్తించారు.

పులి కదలికలపై నిరంతర నిఘా ఉంచిన అధికారులు, దానిని పట్టుకునేందుకు అత్యాధునిక సాంకేతికతను, నిపుణుల బృందాలను రంగంలోకి దించారు. పులిని ఎటువంటి గాయాలు కాకుండా సురక్షితంగా పట్టుకునేందుకు ప్రత్యేక వన్యప్రాణి నిపుణుల బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. 150 మందితో కూడిన హనుమాన్ రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది. పులిని బంధించేందుకు అత్యాధునిక రక్షణ సామాగ్రిని వెంట తెచ్చుకున్నారు.
ప్రస్తుతం ఈ నిపుణుల బృందం పులి అనుకూలమైన ప్రదేశానికి వచ్చే వరకు వేచి చూస్తోంది. పులికి, సిబ్బందికి ఎలాంటి ముప్పు లేని సురక్షిత ప్రాంతంలో దానికి మత్తుమందు ఇచ్చి, బోనులో బంధించాలని అధికారులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ పులిని పట్టుకునేందుకు అటవీ శాఖకు చెందిన సీనియర్ అధికారులు, వివిధ వన్యప్రాణి సంస్థల నిపుణులతో కూడిన సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారు. 24 గంటల పాటు షిఫ్టుల వారీగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.
స్థానిక ప్రజలు, పశువుల రక్షణతో పాటు, పులి ప్రాణాలకు కూడా ఎలాంటి హాని కలగకుండా దానిని సంరక్షించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పులిని తక్షణమే బంధించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అటవీ అధికారులు గ్రామస్థులను అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా అటవీ ప్రాంతాల్లోకి లేదా పొలాల్లోకి వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది.
పులి గ్రామాల్లోకి ప్రవేశించకుండా ఉండటానికి డ్రోన్లు, హైపవర్ లైట్స్, శబ్ధ పరికరాలను ఉపయోగిస్తున్నారు. జనాల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా నిరంతరం అవగాహన కల్పిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని, అడవికి సమీప ప్రాంతాలకు వెళ్లకూడదని ప్రజలకు సూచనలు జారీ చేశారు. మరోవైపు థర్మల్ డ్రోన్ల సాయంతో పులి కదలికలను రెస్క్యూ టీమ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.
{{/usCountry}}పులి గ్రామాల్లోకి ప్రవేశించకుండా ఉండటానికి డ్రోన్లు, హైపవర్ లైట్స్, శబ్ధ పరికరాలను ఉపయోగిస్తున్నారు. జనాల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా నిరంతరం అవగాహన కల్పిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని, అడవికి సమీప ప్రాంతాలకు వెళ్లకూడదని ప్రజలకు సూచనలు జారీ చేశారు. మరోవైపు థర్మల్ డ్రోన్ల సాయంతో పులి కదలికలను రెస్క్యూ టీమ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.
{{/usCountry}}అటవీ శాఖ అధికారులు అందించిన సమాచారం ప్రకారం, ఈ పులి గత కొన్ని రోజులుగా స్థానిక పశువులపై ఎలాంటి కొత్త దాడులు చేయలేదు. ఆకలితో ఉన్న పులి ఎప్పుడు ఎటువైపు వస్తుందోననే ఆందోళన స్థానికుల్లో నెలకొంది.