గోదావరి ప్రాంత వాతావరణానికి అలవాటుపడిన మహారాష్ట్ర పులి.. మళ్లీ రిటర్న్ వచ్చేసింది!
Tiger In East Godavari : తూర్పు గోదావరి ప్రాంతానికి మహారాష్ట్ర పులి అలవాటు పడినట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే మళ్లీ ఆ పులి తిరిగివచ్చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా పులుల సంచారం భయంపుట్టిస్తోంది. అటవీ అధికారులు వాటిని పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తుంటారు. ఈ ఏడాది ప్రారంభం తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత, మహారాష్ట్రలోని తాడోబా అడవుల నుంచి ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించిన మగ పులి గోదావరి ప్రాంత వాతావరణానికి అలవాటుపడినట్లు కనిపిస్తోంది.

జాతీయ పులి సంరక్షణ సంస్థ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 6న తూర్పు గోదావరి జిల్లాలోని కుర్మాపురం గ్రామంలో మత్తుమందు ఇచ్చి పట్టుకున్నారు. ఈ పులిని ఫిబ్రవరి రెండో వారంలో పాపికొండ నేషనల్ పార్కు వైపు విడుదల చేశారు. అయితే వాగులు, వంకలు దాటుతూ.. ఆహారం కోసం వెతుకుతూ.. ఈ పులి గోదావరి నదిని దాటి మళ్లీ తూర్పు గోదావరి జిల్లాకు తిరిగి వచ్చింది. అయితే డిసెంబర్ 2025లో మహారాష్ట్రలోని తన స్వస్థలమైన తాడోబా-అంధారి టైగర్ రిజర్వ్ను విడిచిపెట్టినప్పటి నుంచి ఇది ఏ మనిషిపైనా దాడి చేయలేదు.
ఫిబ్రవరి 14 నుంచి ఈ పులి గోదావరి నదిని దాటి రెండుసార్లు తూర్పు గోదావరి జిల్లాకు తిరిగి వచ్చింది. పులి ఏ ఒక్క నిర్దిష్ట ప్రదేశానికి పరిమితం కాకుండా జలాశయాల వెంట తిరుగుతోంది. దానికి మత్తుమందు ఇచ్చి పట్టుకోవడం కష్టంగా మారింది. తూర్పు గోదావరి జిల్లా కొరుకొండ మండలం, మునగాల గ్రామాన్ని ఆనుకుని ఉన్న కొండ ప్రాంతాల్లో ఏప్రిల్ 22 రాత్రి నుంచి ఇది సంచరిస్తోంది.
మునగాల వద్ద తెల్లవారుజామున 3 గంటల తరువాత ట్రాకర్ ద్వారా అటవీ అధికారులు కదలికలను గుర్తించారు. కాపవరం పాండవుల మెట్ట నుంచి గురువారం రాత్రి కిందికి దిగిన పులి స్థానిక బ్రహ్మలింగం చెరువులో ఉన్నది. ఆ తర్వాత అక్కడి నుంచి మునగాల కొండ పైకి చేరుకున్నది. గత 48 గంటల్లో పులి వల్ల పశువులు చనిపోయినట్లు ఎలాంటి సమాచారం లేదు.
రాజమహేంద్రవరం అటవీ రేంజ్ అధికారి దావీదురాజు ఆధ్వర్యంలో రెస్క్యూ టీమ్, ప్రత్యేక బృందాలు మునగాల కొండ వద్ద గస్తీలో ఉన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి కూడా కొన్ని బృందాలను రప్పించారు. పులిని బంధించేందుకు ఏర్పాట్లు చేశారు. తీవ్రమైన ఎండల కారణంగా పులి రోజంతా జలాశయాల్లోనే గడుపుతోంది. సంరక్షణ నిబంధనల ప్రకారం జలాశయంలో ఉన్న జంతువుకు మత్తుమందు ఇచ్చి లొంగదీసుకోవడానికి వీలు లేదు. రాత్రిపూట సంచారం ఎక్కువగా చేస్తోంది.
ఏప్రిల్ 6 నాటికి, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నాలుగు రాష్ట్రాల్లో 53 రోజుల పాటు ప్రయాణించింది ఈ పులి. 650 కిలోమీటర్లకు పైగా నడిచింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


