అనంతపురం జిల్లాలో హనీట్రాప్ గుట్టురట్టైంది. అయితే అధికార పార్టీకి చెందిన ఇద్దరు అనుచరులు ఈ దందా నడిపిస్తున్నారనే ఆరోపణలు కూడా అనంతపురంలో సంచలనం సృష్టిస్తున్నాయి. అంతేకాదు వీరికి పోలీసులు కూడా సహకరిస్తున్నారని ప్రచారం జరిగింది.

విశ్రాంత ఉద్యోగులు, పూజారులు, ధనవంతులను లక్ష్యంగా చేసుకుని హనీట్రాప్ ముఠాలు పోలీసుల సహకారంతో పనిచేస్తున్నాయని విచారణలో వెల్లడైంది. ఏప్రిల్ 18న ఒక యువకుడు ఫిర్యాదు చేయడంతో ఈ దందా వెలుగులోకి వచ్చింది. తనను ఒక ఇంటికి రప్పించి, దాడి చేసి, బట్టలు విప్పించి, అసభ్యకరమైన ఫోటోలతో బ్లాక్మెయిల్ చేశారని ఆ యువకుడు ఆరోపించాడు. అవమానానికి భయపడి బాధితుడు ఆ ముఠాకు సుమారు రూ. 4 లక్షలు చెల్లించినట్లు సమాచారం.
హనీ ట్రాప్ ముఠాతో ఇద్దరు ఇన్స్పెక్టర్లు, సబ్-ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లతో సహా డజనుకు పైగా సిబ్బందికి సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా రాప్తాడు ఇన్స్పెక్టర్ శ్రీ హర్ష, త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ రాజేంద్రనాథ్ యాదవ్లను వీఆర్కు పంపినట్లు తెలుస్తోంది. మరికొంతమంది పోలీసులపై కూడా నిఘా ఉన్నట్లు తెలిసింది.
ఈ కేసులో రంగమ్మ, రాజేష్ అనే పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తిరుపతిలో గతంలో ఇలాంటి కేసులోనే నిందితురాలిగా రంగమ్మ అలియాస్ చిన్ని ఉంది. అయితే డబ్బు ఉన్నవాళ్లను ఈ హనీట్రాప్ గ్యాంగ్ టార్గెట్ చేసుకుంటుందట. వారికి అమ్మాయిలతో ఫోన్స్, మెసేజులు చేయించి.. ఇక ప్లాన్ ప్రకారం.. అవతలి వ్యక్తిని బుక్ చేసేస్తారని తెలిసింది. వ్యక్తిని రప్పించి, వీడియోలు తీసి.. ఆపై బెదిరింపులు మెుదలుపెడతారు.
అనంతపురం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ దందాను నడుపుతున్న ముఠాకు చెందిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నగదు, ఆయుధాలు, ప్రామిసరీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. 100 మందికి పైగా లక్ష్యంగా చేసుకున్నారని, ఇప్పటివరకు సుమారు 20 మంది బాధితులు ముందుకు వచ్చారని అధికారులు తెలిపారు.
పోలీసు సిబ్బంది పాత్రతో సహా పలు అంశాలపై సమగ్ర నివేదిక సమర్పించేందుకు ఎస్పీ ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. హనీట్రాప్ గ్యాంగ్ సభ్యులకు, కొంతమంది పోలీసులకు మధ్య జరిగినట్లుగా చెబుతున్న ఫోన్ సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
{{/usCountry}}పోలీసు సిబ్బంది పాత్రతో సహా పలు అంశాలపై సమగ్ర నివేదిక సమర్పించేందుకు ఎస్పీ ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. హనీట్రాప్ గ్యాంగ్ సభ్యులకు, కొంతమంది పోలీసులకు మధ్య జరిగినట్లుగా చెబుతున్న ఫోన్ సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
{{/usCountry}}ఇటీవలి నెలల్లో ఈ ముఠా కనీసం 20 మంది బాధితులను లక్ష్యంగా చేసుకుని దాదాపు రూ.1 కోటి వసూలు చేసిందని అనంతపురం రూరల్ డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. పోలీసులు ఇప్పటివరకు సుమారు రూ.13 లక్షల నగదు, కత్తులు, ప్రామిసరీ నోట్లతో సహా పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. చాలా సిస్టమేటిక్గా ఈ హనీట్రాప్ ముఠాను నడిపించినట్టుగా తెలుస్తోంది. దీనిపై పోలీసులు సీరియస్గా ఉన్నారు.