మొంథా తుపాను ప్రభావంతో నల్లమల ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. ఎడతెరిపిలేకుండా వర్షం పడుతుండటంతో… శ్రీశైలం ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.

పెద్ద డోర్నాలలోని అటవీశాఖ చెక్ పోస్ట్ వద్ద వాహనాలను శ్రీశైలం వైపునకు వెళ్లకుండా నిలిపివేశారు. డ్యామ్ ఘాట్ రోడ్డుపై భారీ కొండచరియలు విరిగిపడటంతో హైదరాబాద్-శ్రీశైలం బస్సుల రాకపోకలకు అంతరాయం కలిగింది. జేసీబీలతో రాళ్లను తొలగిస్తున్నారు.లింగాలగట్టు చెక్ పోస్ట్ వద్ద వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది.
అచ్చంపేట - శ్రీశైలం ప్రధాన రహదారిపై చంద్రవాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో శ్రీశైలం రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హాజీపూర్ నుండి బ్రాహ్మణపల్లి మధ్య ఉన్న వంతెన పై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో వాహనాలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.
శ్రీశైలం రహదారి సమీపంలోని చేమవాగు, చింతల సమీపంలోని వీర్ల వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుచోంది. ఫలితంగా శ్రీశైలం రహదారిలో భారీగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. అయితే శ్రీశైలం వచ్చే ప్రయాణికులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రయాణాలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
మొంథా తుపాను కారణంగా నల్లమల అడవుల్లోని పాలంకలో తూర్పు కనుమల్లో జలపాతం పొంగిపోర్లుతుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ గా మారాయి.
పొంగిపొర్లుతున్న వాగులు, కాలువలు, చెరువులు దాటే ప్రయత్నం చేయరాదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. ఇబ్బందికర పరిస్థితులు ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలని… ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
మరోవైపు కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నివాసం ఉన్న మట్టి మిద్దె కూలింది. భారీ వర్షాలతో మట్టిమిద్దె నానిపోవటంతో ఈ ఘటన జరిగింది.
పల్నాడు జిల్లా వినుకొండలో భారీ వర్షాలకు గోడకూలి వృద్ధురాలి మృతి చెందింది. 18వ వార్డు రామాలయం సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో వృద్ధురాలైన రాములమ్మ ప్రాణాలు కోల్పోయింది.
{{/usCountry}}పల్నాడు జిల్లా వినుకొండలో భారీ వర్షాలకు గోడకూలి వృద్ధురాలి మృతి చెందింది. 18వ వార్డు రామాలయం సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో వృద్ధురాలైన రాములమ్మ ప్రాణాలు కోల్పోయింది.
{{/usCountry}}భారీ వర్షాలకు ఒంగోలులోని ఆంధ్రకేసరి యూనివర్సిటీ, జవహర్ నవోదయ విద్యాలయం నీట మునిగాయి. రెండు క్యాంపస్లలోకి భారీగా వరద నీరు చేరింది. ఆఫీస్ రూములు, తరగతి గదుల్లోకి నీరు చేరింది. పలు జిల్లాలకు చెందిన విద్యార్థులను ఇళ్లకు పంపించగా… ఇతర రాష్ట్రాల విద్యార్థులు క్యాంపస్లోనే ఉండిపోయారు.
మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ రివ్యూ చేశారు. కృష్ణా, ఏలూరు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, బాపట్ల, పల్నాడు, జిల్లాల్లో ముంపునకు గురైన ప్రాంతాల పరిశీలించారు.