జైలు జీవితాన్ని ఎంజాయ్ చేశాను.. విడుదల తర్వాత అంబటి రాంబాబు కామెంట్స్
మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయనను జైలు నుంచి విడుదల చేశారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు బెయిల్ ఇచ్చింది. పోలీసుల కస్టడీ పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసింది. 2023 సంక్రాంతి లక్కీ డ్రా కేసులో అంబటికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జనవరి 31 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో అంబటి ఉన్నారు. ఒక కేసులో అంబటిపై పట్టాభిపురం పోలీసులు నమోదు చేశారు. ఈ కేసులో బెయిల్ మంజూరై విడుదల అవుతారని అనుకుంటున్న తరుణంలో వెంటనే మరో కేసులో పీటీ వారెంట్ జారీ అయ్యింది. గతంలో అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబరాలపై జనసేన నాయకుడు పెట్టిన కేసులో పీటీ వారెంట్ జారీచేశారు. తాజాగా ఈ కేసులో అంబటికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

2023లో సత్తెనపల్లిలో సంక్రాంతి లాటరీ కేసులో అంబటి రాంబాబు బుధవారం సాయంత్రం రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి బెయిల్పై విడుదలయ్యారు. ఈ కేసుతోపాటుగా జనవరి 31న గుంటూరులో జరిగిన నిరసన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును దుర్భాషలాడడం, పోలీసు సిబ్బంది విధులను నిర్వర్తించకుండా అడ్డుకోవడం వంటి కేసుల్లో ఆయన 17 రోజుల రిమాండ్ను అనుభవించారు.
గుంటూరు నగరంలో టీడీపీ మద్దతుదారులు ఆయన ఇంటిపై దాడి చేశారని ఆరోపిస్తూ ఆ రోజు ఆయన ఇంటి వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఆయనను అరెస్టు చేశారు.
విడుదలైన తర్వాత అంబటి రాంబాబు విలేకరులతో మాట్లాడారు. 'జనవరి 31న గుంటూరులో నా ఇల్లు, కుటుంబంపై దాడికి చంద్రబాబు, లోకేష్ కుట్ర పన్నారు. దాడి చేసిన వారిని నిరోధించకుండా అక్కడ ఉన్న పోలీసులు ప్రేక్షకులుగా మిగిలిపోయారు.' అని అన్నారు.
ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం కొనసాగిస్తానని రాంబాబు చెప్పారు. జైలులో తనకు ఎలాంటి ప్రత్యేక మర్యాదలు ఆశించలేదన్నారు. సౌకర్యాల గురించి ఎటువంటి ఫిర్యాదులు లేకుండా రిమాండ్ వ్యవధిని అనుభవించానని చెప్పారు. రాబోయే రోజుల్లో తన ఇల్లు, కుటుంబంపై జరిగిన దాడి గురించి మాట్లాడుతానని తెలిపారు.
'నేను విడుదల కాకుండా కొందరు వ్యవహరించారు. నాపై నమోదైన కేసుల వెనక రాజకీయ కక్ష సాధంపే కారణం. నా కుటుంబ సభ్యులను సైతం వేధించారు. బాధితుడిని జైలులో ఉంచి, నిందితులను బయట ఉంచిన పరిస్థితి ఏర్పడింది. జరిగిన అన్యాయానికి దేవుడే తీర్పు చెబుతాడు. న్యాయం ఆలస్యమైనా తప్పకుండా గెలుస్తుంది. ఎన్ని రోజులైనా జైళ్లో ఉండాలని వెళ్లాను. జైలు అంటే భయపడే వ్యక్తిని కాదు. జైలు శిక్షణా కేంద్రం లాంటిది. నేను జైలు జీవితాన్ని ఎంజాయ్ చేశారు.' అని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


