ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతోపాటు వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల వల్ల రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల పాటు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ తీరం నుండి తెలంగాణ మీదుగా మధ్య మహారాష్ట్ర వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం వేగంగా మారిపోతోంది.

ఈ వాతావరణ మార్పులపై ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఉన్న ద్రోణి ప్రభావం వల్ల రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన ఈదురు గాలులు వీస్తాయని, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కోరారు. జూన్ 27 నాడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. రాబోయే రెండు రోజులు పరిస్థితులు ఇలాగే ఉండే అవకాశం ఉంది.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడ, కోనసీమ, ప్రకాశం జిల్లాలోని మార్కాపురం పరిసర ప్రాంతాలు మరియు నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేశారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉండి, అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది.
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సమయంలో ప్రజలు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుంటారని, దీనివల్ల ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు, రైతులు జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలని సూచించింది.
పిడుగులు పడే సమయంలో పెద్ద పెద్ద చెట్లు, పాతబడిన హోర్డింగులు (ప్రకటనల బోర్డులు), విద్యుత్ స్తంభాల కింద నిలబడకూడదు. ఈదురు గాలుల వల్ల తెగిపడిన విద్యుత్ తీగలు, విరిగిన స్తంభాలు లేదా డ్యామేజ్ అయిన పవర్ లైన్ల దరిదాపుల్లోకి వెళ్లకూడదు.
{{/usCountry}}పిడుగులు పడే సమయంలో పెద్ద పెద్ద చెట్లు, పాతబడిన హోర్డింగులు (ప్రకటనల బోర్డులు), విద్యుత్ స్తంభాల కింద నిలబడకూడదు. ఈదురు గాలుల వల్ల తెగిపడిన విద్యుత్ తీగలు, విరిగిన స్తంభాలు లేదా డ్యామేజ్ అయిన పవర్ లైన్ల దరిదాపుల్లోకి వెళ్లకూడదు.
{{/usCountry}}పొలాల్లో పనులు చేసుకునే రైతులు, పశువులను మేపే కాపరులు ఆకాశం నల్లగా మారి ఉరుములు వినిపించగానే వెంటనే సురక్షితమైన శాశ్వత భవనాల్లోకి వెళ్లాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉండటం ప్రాణాంతకం కావచ్చు. వర్షం పడే సమయంలో రోడ్లు జారే ప్రమాదం ఉన్నందున వాహనదారులు వేగాన్ని నియంత్రించుకోవాలని, లోతట్టు ప్రాంతాల గుండా ప్రయాణించవద్దని అధికారులు సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం, విపత్తు నిర్వహణ సంస్థ క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాయి. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారుల సహాయం తీసుకోవాలని తెలిపింది.