...
...
Next Story

ఐఎండీ వెదర్ అప్డేట్.. ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే వారం రోజుల వాతావరణం ఇలా

భారత వాతావరణ శాఖ ఆగస్టు 14 నుండి 17 వరకు కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆగస్టు 18 వరకు కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది.

Published on: Aug 15, 2026, 13:40:02 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ పరిధిలో రాబోయే కొన్ని రోజుల పాటు వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆగస్టు 14 నుండి 17 వరకు కోస్తాంధ్ర, యానాంలలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎమ్‌డీ అంచనా వేసింది.

వెదర్ అప్డేట్
వెదర్ అప్డేట్

అంతేకాకుండా ఆగస్టు 18 వరకు కోస్తాంధ్ర, యానాం, రాయలసీమల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. జిల్లా స్థాయి హెచ్చరికల ప్రకారం, మొదటి నాలుగు రోజుల్లో ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. రాయలసీమలో, జిల్లా, రోజును బట్టి గంటకు 30 నుండి 50 కి.మీ వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది వాతావరణ శాఖ.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఆగస్టు 17 వరకు ఉరుములు, మెరుపుల హెచ్చరిక అమల్లో ఉంటుంది. విశాఖపట్నంలో ఆగస్టు 16 వరకు ఇదే హెచ్చరిక ఉండగా, ఆగస్టు 17న గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అనకాపల్లిలో ఆగస్టు 16 వరకు ఉరుముల హెచ్చరిక ఉంది. కాకినాడ, తూర్పు గోదావరి, యానాం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో ఐదు రోజుల కాలంలో గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.

ఏడు రోజుల సూచన ప్రకారం, పలు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. తదుపరి రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురవవచ్చు. విశాఖపట్నంలో ఆగస్టు 16 వరకు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆగస్టు 17, 18 తేదీల్లో తేలికపాటి వర్షాలు కురవవచ్చు.

ఇక శుక్రవారం పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. విశాఖపట్నంలో 34.5 డిగ్రీలు (సాధారణం కంటే 3 డిగ్రీలు ఎక్కువ) ఉష్ణోగ్రత నమోదు కాగా, కళింగపట్నంలో 36.1 డిగ్రీలు (సాధారణం కంటే 4.1 డిగ్రీలు ఎక్కువ) నమోదైంది. జంగమహేశ్వరపురం అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతను (38.8 డిగ్రీలు) నమోదు చేసింది.

తీరం వెంట బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఉరుములు, మెరుపులు వస్తున్న సమయంలో విద్యుత్ స్తంభాలు, చెట్ల కింద నిలబడకూడదు. కోత దశలో ఉన్న ధాన్యం, ఉద్యానవన పంటలు దెబ్బతినకుండా రైతులు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe