బంగాళాఖాతంలో చోటుచేసుకున్న వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్లో వాతావరణం మారింది. ఉత్తర బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో గురువారం తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో అల్పపీడనం (Low Pressure Area) బలపడిందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ప్రకటించింది.

ఈ అల్పపీడనం రాబోయే రెండు రోజుల్లో మరింత వేగంగా కదిలే అవకాశం ఉండటంతో తీర ప్రాంత జిల్లాల్లో వాతావరణ పరిస్థితులు తీవ్రంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, మన్యం జిల్లాల్లో రానున్న 48 గంటల పాటు వాతావరణం ముబ్బుపట్టి ఉంటుందని అధికారులు తెలిపారు. కొన్నిచోట్ల వర్షాలు కూడా పడుతాయి.
ఈ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడా విస్తారంగా తుఫాను గాలులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. కొన్ని సమయాల్లో గాలుల వేగం గరిష్టంగా గంటకు 60 కిలోమీటర్లకు చేరే ప్రమాదం ఉంది.
బంగాళాఖాతంలో అల్పపీడనంతో సముద్రంలో కెరటాలు ఎగసిపడుతున్నాయి. అలల తీవ్రత ఉండటంతో రాబోయే 48 గంటల పాటు మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తీరానికి చేరువలో ఉండే మత్స్యకార గ్రామాల ప్రజలు, లోతట్టు ప్రాంత నివాసితులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సముద్రంలోకి ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే సమీప తీరాలకు తిరిగి రావాలని, తమ పడవలు, వలలను సురక్షిత ప్రాంతాల్లో భద్రపరుచుకోవాలని కోరారు.
తీరప్రాంత జిల్లాల యంత్రాంగాన్ని విపత్తు నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున వర్షం కురిసే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడకూడదని అధికారులు తెలిపారు. తీర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర సహాయం కోసం స్థానిక రెవెన్యూ, విపత్తు నిర్వహణ అధికారుల హెల్ప్లైన్ నంబర్లను సంప్రదించాలి.
{{/usCountry}}తీరప్రాంత జిల్లాల యంత్రాంగాన్ని విపత్తు నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున వర్షం కురిసే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడకూడదని అధికారులు తెలిపారు. తీర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర సహాయం కోసం స్థానిక రెవెన్యూ, విపత్తు నిర్వహణ అధికారుల హెల్ప్లైన్ నంబర్లను సంప్రదించాలి.
{{/usCountry}}