ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది రుతుపవనాల ప్రవేశం తర్వాత ఆశించిన స్థాయిలో వర్షాలు పడక తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. పశ్చిమ మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే రుతుపవన వ్యవస్థలపై ఎల్ నినో తీవ్ర ప్రభావం చూపుతోందని అమరావతి భారత వాతావరణ శాఖ, విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు.

ఈ ఏడాది రుతుపవనాల ఆరంభం నుంచే రాష్ట్రంలో వర్షపాతం తీవ్రంగా పడిపోయింది. జూన్ మాసంలో ఒకానొక దశలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 69 శాతానికి పైగా వర్షపాత లోటు నమోదైంది. దీనితో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా ఎల్ నినో యాక్షన్ ప్లాన్ను కూడా అమల్లోకి తెచ్చింది.
జూలై నెలలో సైతం పరిస్థితి మెరుగుపడలేదు. ఎల్ నినో ప్రభావంతో అసమానంగా కురిసిన వర్షాల వల్ల 38 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలు వర్షాభావంతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 65.5 శాతం వర్షపాత లోటు నమోదు కాగా, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 53.5 శాతం, పార్వతీపురం మన్యం జిల్లాలో 53.3 శాతం, పోలవరం ప్రాంతంలో 45.4శాతం మేర లోటు నమోదైంది.
ప్రస్తుతం బంగాళాఖాతంలో నెలకొన్న వాతావరణ పరిస్థితులు 2002 నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తీవ్ర కరువు పరిస్థితులను గుర్తుచేస్తున్నాయని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ పి.ఎల్.ఎన్. మూర్తి తెలిపారు. ఆ సంవత్సరం కూడా ఎల్ నినో ప్రభావం వల్ల వ్యవసాయం, తాగునీటి వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని ఆయన పేర్కొన్నారు.
అమరావతి ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త ఎస్. కరుణాసాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. సాధారణంగా జూలై, ఆగస్టు నెలల్లో రుతుపవనాల ట్రఫ్ వాయువ్య భారతదేశం నుండి వాయువ్య బంగాళాఖాతం వరకు విస్తరిస్తుంది. అయితే ఈ ఏడాది ఈ ట్రఫ్ పదేపదే ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరానికే పరిమితం కావడంతో, వాయువ్య బంగాళాఖాతంలో మాత్రమే సాధారణ రీతిలో 3 వ్యవస్థలు ఏర్పడ్డాయి.
{{/usCountry}}అమరావతి ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త ఎస్. కరుణాసాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. సాధారణంగా జూలై, ఆగస్టు నెలల్లో రుతుపవనాల ట్రఫ్ వాయువ్య భారతదేశం నుండి వాయువ్య బంగాళాఖాతం వరకు విస్తరిస్తుంది. అయితే ఈ ఏడాది ఈ ట్రఫ్ పదేపదే ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరానికే పరిమితం కావడంతో, వాయువ్య బంగాళాఖాతంలో మాత్రమే సాధారణ రీతిలో 3 వ్యవస్థలు ఏర్పడ్డాయి.
{{/usCountry}}మధ్య, దక్షిణ బంగాళాఖాతంలో వాతావరణం అనుకూలించకపోవడంతో ఆంధ్రప్రదేశ్ తీరానికి తగినంత వర్షపాతం అందలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ వర్షాలు తెచ్చే బలమైన వాతావరణ వ్యవస్థలు పోస్ట్ మాన్సూన్ (రుతుపవనాల అనంతర కాలం) సమయంలోనే ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉందని కరుణాసాగర్ వివరించారని డెక్కన్ క్రానికల్ పేర్కొంది. రాబోయే రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతం లేదా అండమాన్ సముద్రంలో వ్యవస్థలు ఏర్పడి, అవి ఏపీ తీరం వైపు పయనిస్తేనే రాష్ట్రంలో వర్షపాత లోటు భర్తీ అయ్యే అవకాశం ఉందన్నారు.