తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. రాబోయే నాలుగు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రత్యేక హెచ్చరించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోనూ ఉపరితల ఆవర్తన ప్రభావంతో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
ఈ జిల్లాలకు అలర్ట్….

హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. జూలై 3వ తేదీ ఉదయం వరకు పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడొచ్చు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది.
- జూన్ 30 ఉదయం వరకు: ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయి.
- జూన్ 30 ఉదయం నుండి జూలై 1 ఉదయం వరకు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే వీలుంది.
- జూలై 1 ఉదయం నుండి జూలై 2 ఉదయం వరకు ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
- జూలై 2 ఉదయం నుండి జూలై 3 ఉదయం వరకు ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి.
ఏపీకి వర్ష సూచన:
ఏపీలోనూ రాబోయే 24 గంటల్లో వర్షాల ప్రభావం బలంగా ఉండనుంది. రాష్ట్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంగళవారం పలు ప్రాంతాల్లో విస్తారంగా వానలు పడతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
{{/usCountry}}ఏపీలోనూ రాబోయే 24 గంటల్లో వర్షాల ప్రభావం బలంగా ఉండనుంది. రాష్ట్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంగళవారం పలు ప్రాంతాల్లో విస్తారంగా వానలు పడతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
{{/usCountry}}ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంతో పాటు కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆయన వివరించారు. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందన్నారు. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండకూడదని, సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని అధికారులు సూచించారు.