ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్ - ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు! ఈ జిల్లాలకు హెచ్చరికలు
AP Weather Updates : దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో శనివారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన ఈదురుగాలుల వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది.
AP Weather Updates : రాష్ట్రంలో రానున్న 24 గంటల్లో వాతావరణం మరింత చల్లబడనుంది. పలు చోట్ల విభిన్నమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ప్రకారం… దక్షిణ కోస్తాంధ్ర మరియు దాని పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి నిర్దిష్ట ఎత్తులో ఒక బలమైన ఉపరితల ఆవర్తనం (Cyclonic Circulation) కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

ఈ జిల్లాలకు వర్ష సూచన…
ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా శనివారం(జూన్ 13) నాడు రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో వాతావరణంలో ఆకస్మిక మార్పులు రానున్నాయి. ముఖ్యంగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమ పరిధిలోని అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు మరియు తీవ్రమైన పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వీటితో పాటు రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో సైతం అక్కడక్కడా ఆకాశం మేఘావృతమై ఉండి, పిడుగులతో కూడిన తేలికపాటి జల్లులు పడే వీలుంది. ఈ వర్షాల సమయంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
వాతావరణం వేగంగా మారుతున్నందున కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ సూచించింది. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, అలాగే పశువుల కాపరులు బయట ఉండకూడదని తెలిపింది.
పిడుగులు పడే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున చెట్ల కింద, విద్యుత్ స్తంభాల కింద, పాతపడిపోయిన షెడ్ల కింద ఆశ్రయం పొందకూడదని హెచ్చరించింది. ఈదురుగాలుల వల్ల హోర్డింగులు, బలహీనమైన కట్టడాలు కూలిపోయే అవకాశం ఉన్నందున… ప్రయాణాల్లో ఉన్నవారు సురక్షితమైన భవనాల్లోకి వెళ్లాలని వివరించింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

