వెదర్ అప్డేట్స్ : తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్ - ఏపీలోని ఈ ప్రాంతాలకు వర్ష సూచన..!
ఏపీకి వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఇవాళ, రేపు, ఎల్లుండి కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.
నైరుతి బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఇది శ్రీలంకకి తూర్పు ఈశాన్యందా 160 కి.మీ, పుదిచేరికి ఆగ్నేయంగా 540 కిమీ. చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 710 కి.మీ దూరంలో కేంద్రీకృతమైన ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఇది జనవరి 10వ తేదీన వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర శ్రీలంక తీరాన్ని మధ్యాహ్నం సమయంలో దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

ఏపీకి వర్ష సూచన..
- అమరావతి వాతావరణ కేంద్రం బులిటెన్ ప్రకారం... ఉత్తర కోస్తాలో ఇవాళ, రేపు పొడి వాతావరణం, పొగమంచు వాతావరణ పరిస్థితులుంటాయి.
- దక్షిణ కోస్తాలో ఇవాళ పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే సూచనలున్నాయి.
- రాయలసీమ ప్రాంతంలో ఇవాళ కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి కూడా ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు.
- రాగల 5 రోజుల్లో కోస్తాంధ్రా, యానాం, రాయలసీమ కనిష్ట ఉష్ణోగ్రతల నమోదులో గణనీయమైన మార్పులు ఉండకపోవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఇక తెలంగాణలో చూస్తే పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారం... రాబోయే 2 రోజుల్లో అక్కడకక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల నుంచి 4 డిగ్రీలు తక్కువగా ఉండే సూచనలున్నాయి. ఎలాంటి హెచ్చరికలు లేవు.
ప్రస్తుతం తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగానే ఉంటోంది. పలు చోట్ల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. హైదరాబాద్ సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉంటోంది. ఉదయం సమయాల్లో పొగమంచు ఎక్కువగా ఉండటంతో... వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే సంక్రాంత్రి తర్వాత చలి తీవ్రత క్రమంగా తగ్గే సూచనలున్నాయి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

