Tirumala May Festivals 2026 : శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అప్డేట్ ఇచ్చింది. మే నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలను ప్రకటించింది. మే 1వ తేదీన కూర్మ జయంతి, పౌర్ణమి గరుడసేవ ఉండనుంది. మే 12వ తేదీన హనుమజ్జయంతి నిర్వహిస్తారు.
మే నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు:
- మే 1న కూర్మ జయంతి, పౌర్ణమి గరుడసేవ.
- మే 2న అన్నమాచార్య జయంతి.
- మే 3న పరాశర భట్టర్ వర్ష తిరు నక్షత్రం.
- మే 12న హనుమజ్జయంతి.
- మే 21న నమ్మళ్వార్ ఉత్సవారంభం.
- మే 26న వరదరాజస్వామి వర్ష తిరు నక్షత్రం.
- మే 30న నమ్మళ్వార్ శాత్తుమొర.

ప్రతి నెలా పౌర్ణమి నాడు తిరుమలలో జరిగే గరుడ వాహన సేవ మే నెలలో కూడా ఘనంగా నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటల నుండి మాడ వీధుల్లో మలయప్ప స్వామి వారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు.
మే నెల వేసవి సెలవుల సమయం కావడంతో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. దర్శనం టికెట్లు ముందుగానే బుక్ చేసుకున్న వారు, దర్శన సమయానికి అనుగుణంగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలి. ఎండల దృష్ట్యా టీటీడీ మాడ వీధుల్లో మరియు క్యూ లైన్లలో ప్రత్యేక షెడ్లు, చల్లని నీటి సౌకర్యం కల్పిస్తోంది. వృద్ధులు, చిన్న పిల్లలతో వచ్చే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ముఖ్యంగా శుక్ర, శని, ఆదివారాల్లో రద్దీ మరింత తీవ్రంగా ఉంటుంది కాబట్టి…. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా టీటీడీ అదనపు చర్యలు తీసుకుంటోంది. ఉత్సవాల కారణంగా కొన్ని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసే అవకాశం ఉంది, కాబట్టి భక్తులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్సైట్ ( https://news.tirumala.org/ ) ను గమనించాలని కోరుతున్నారు.
ఇక తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మే నెలలో విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. మే 1, 31వ తేదీలలో పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ఉదయం 9.30 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం జరుగనుంది. ఈ సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి దర్శనం ఇవ్వనున్నారు.
{{/usCountry}}ఇక తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మే నెలలో విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. మే 1, 31వ తేదీలలో పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ఉదయం 9.30 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం జరుగనుంది. ఈ సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి దర్శనం ఇవ్వనున్నారు.
{{/usCountry}}మే 2, 9, 16, 23, 30వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు. అనంతరం ఆలయంలో ఊంజల్సేవ జరుగనుంది.
- మే 8న అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 8 గంటలకు శ్రీ కోదండరామస్వామివారి ఆస్థానం.
- మే 12న హనుమజయంతి.
- మే 16న అమావాస్య సందర్భంగా ఉదయం 8.30 గంటలకు సహస్ర కలశాభిషేకం చేపడతారు. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనసేవ జరుగనుంది.
- మే 21వ తేదీ పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు.