తొమ్మిది నెలలు మోసి, కని, పెంచి.. ప్రయోజకుడిని చేయాలనుకున్న ఆ తల్లికి, తన ప్రాణాలు తీసే యముడు తన కడుపునే పుడతాడని తెలియదు. లోకం నిద్రపోతున్న వేళ, ఇంట్లో ఉన్న కొడుకే కాలయముడిగా మారి కన్నతల్లిని ఆహుతి చేసిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలును ఉలిక్కిపడేలా చేసింది.

ఒంగోలు నగరంలోని వెంకట రమణమ్మ అనే వృద్ధురాలు తన పెద్ద కుమారుడు కిషోర్ బాబుతో కలిసి నివసిస్తోంది. మంగళవారం తెల్లవారుజామున, ప్రపంచమంతా ప్రశాంతంగా నిద్రిస్తున్న వేళ.. ఆ ఇంట్లో మాత్రం నిప్పుల్లో ఓ తల్లి మృతిచెందింది.
మాంసం దుకాణం నడుపుకొనే కిషోర్ బాబు, తల్లి గాఢనిద్రలో ఉండగా ఇంటికి నిప్పు పెట్టాడు. చూస్తుండగానే మంటలు ఎగిసిపడ్డాయి.. ఆ మంటల మధ్య ఆమె అరుపులు కూడా బయటకు రాకుండానే ఆ వృద్ధురాలు బూడిదైపోయింది.
మంటలు రావడం గమనించిన స్థానికులు పరుగున వచ్చి చూడగా, కిషోర్ బాబు అక్కడ నిలబడి ఉన్నాడు. ఏం జరిగిందని నిలదీస్తే.. పొంతన లేని సమాధానాలు చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే జరగకూడని నష్టం జరిగిపోయింది.
వెంకట రమణమ్మ విగతజీవిగా పడి ఉంది. నిందితుడు కిషోర్ బాబుకు గత కొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేదని స్థానికులు చెబుతున్నారు. కానీ ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఈ ఘటన విన్న ప్రతి ఒక్కరి గుండె బరువెక్కుతోంది. చిన్న కుమారుడు చెన్నైలో స్థిరపడి ఉన్నా, పెద్ద కొడుకు వద్దే ఉంటూ తన బాధ్యత నెరవేర్చుకుంటున్న తల్లికి.. చివరికి ఇలాంటి విషాదాంతం ఎదురుకావడం బాధాకరం. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన కిషోర్ బాబు కోసం గాలిస్తున్నారు.
తల్లి నిద్రిస్తున్న సమయంలో ఇంటికి నిప్పుపెట్టడంపై స్థానికంగా కలకలం రేగింది. మంటలు చెలరేగడం చూసి ఇరుగుపొరుగువారు.. షాక్ అయ్యారు. కొడుకు కిషోర్ బాబును అడగ్గా.. సరైన సమాధానాలు చెప్పలేదు. గట్టిగా జనాలు పైకి వెళ్లి ప్రశ్నించగా.. భయంతో అక్కడ నుంచి పారిపోయాడు.
{{/usCountry}}తల్లి నిద్రిస్తున్న సమయంలో ఇంటికి నిప్పుపెట్టడంపై స్థానికంగా కలకలం రేగింది. మంటలు చెలరేగడం చూసి ఇరుగుపొరుగువారు.. షాక్ అయ్యారు. కొడుకు కిషోర్ బాబును అడగ్గా.. సరైన సమాధానాలు చెప్పలేదు. గట్టిగా జనాలు పైకి వెళ్లి ప్రశ్నించగా.. భయంతో అక్కడ నుంచి పారిపోయాడు.
{{/usCountry}}స్థానికులు ఓ వైపు మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తూనే.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే వారు అక్కడకు వచ్చారు. పైపుల సాయంతో ఎగిసిపడుతున్న మంటలను నీళ్లు కొట్టి అదుపు చేశారు.. కానీ అప్పటికే ఇంట్లో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. వెంకట రమణమ్మ మంటల్లో కాలి బూడిదైంది.
కిషోర్ బాబుకు మతిస్థిమితం లేదని చెబుతున్నప్పటికీ.. హత్యకు గల అసలైన కారణాల కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.